నాలుగో రోజూ నష్టాల్లోనే.. 667 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 667 పాయింట్లు, నిఫ్టీ 184 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

Published : 29 May 2024 15:52 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మదుపర్ల లాభాల స్వీకరణకు దిగడం వంటి కారణాలతో సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీల పతనాన్ని శాసించాయి. సెన్సెక్స్‌ 660కు పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22,700 ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 74,826.94 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 74,454.55 - 74,986.22 పాయింట్ల మధ్య చలించిన సూచీ.. చివరికి 667.55 పాయింట్ల నష్టంతో 74,502.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 184.20 పాయింట్ల నష్టంతో 22,703.95 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 84.94 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2,368 వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని