Sunpharma: సన్ఫార్మా డివిడెండు 500%
సన్ఫార్మా, జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.2,654.58 కోట్ల నికర లాభాన్ని, రూ.11,982.90 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో లాభం రూ.1,984.47 కోట్లు, కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.10,930.67 కోట్లుగా నమోదయ్యాయి.
దిల్లీ: సన్ఫార్మా, జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.2,654.58 కోట్ల నికర లాభాన్ని, రూ.11,982.90 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో లాభం రూ.1,984.47 కోట్లు, కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.10,930.67 కోట్లుగా నమోదయ్యాయి. ఫార్ములేషన్ అమ్మకాలు భారత్లో రూ.3,707.80 కోట్లు, అమెరికాలో 476 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3,964 కోట్లు) నమోదయ్యాయి. వివాల్డిస్ హెల్త్ అండ్ ఫుడ్స్లో 60% వాటా కొనుగోలు కారణంగా 2023 డిసెంబరు త్రైమాసికం, 2023-24 ఆర్థిక సంవత్సర ఫలితాలను గతంతో పోల్చిచూడలేమని సన్ఫార్మా తెలిపింది. వివాల్డిస్లో వాటా కొనుగోలు ప్రక్రియ 2023 జూన్ త్రైమాసికంలో పూర్తయ్యింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.5 (500%) తుది డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ఇప్పటికే రూ.8.5 మధ్యంతర డివిడెండును కంపెనీ చెల్లించింది. దీంతో మొత్తం డివిడెండు రూ.13.50కు చేరింది. 2022-23లో చెల్లించిన రూ.11.50 కంటే ఇది ఎక్కువ.
ఛైర్మన్గా దిలీప్ సంఘ్వీ..: ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న దిలీప్ సంఘ్వీని బోర్డు ఛైర్మన్గా నియమించే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) సన్ఫార్మా ఏకీకృత నికర లాభం రూ.9,576.38 కోట్లు కాగా.. 2022-23లో రూ.8,473.58 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.43,885.68 కోట్ల నుంచి రూ.48,496.85 కోట్లకు పెరిగింది. ఫార్ములేషన్ విక్రయాలు భారత్లో రూ.14,889.30 కోట్లు, అమెరికాలో 1,854 మిలియన్ డాలర్లు (సుమారు రూ.15400 కోట్లు)గా నమోదయ్యాయి. ‘2023-24 ఆర్థిక సంవత్సరంలో మా రెండు వ్యాపారాల వార్షిక విక్రయాలు 100 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించాయి. కీలక విపణుల్లో ఈ ఘనత సాధించడం, కొన్నేళ్లుగా మేం చేస్తున్న కృషికి దక్కిన ఫలితానికి నిదర్శనమ’ని సంఘ్వీ తెలిపారు. స్పెషాలిటీ పోర్ట్ఫోలియోను అభివృద్ధి చేసుకోవడాన్ని కొనసాగించడంతో పాటు వ్యాపారాల విస్తరణకు మరిన్ని పెట్టుబడులు పెడతామని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్