Onion: లక్ష టన్నుల ఉల్లి నిల్వ లక్ష్యం
కొరత ఏర్పడినప్పుడల్లా ధరలు పెరుగుతున్నందున, దేశీయంగా లక్ష టన్నుల మేర ఉల్లిపాయలను అదనంగా నిల్వ ఉంచేందుకు రేడియేషన్ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రేడియేషన్తో సాధించేందుకు ప్రభుత్వ కసరత్తు
దిల్లీ: కొరత ఏర్పడినప్పుడల్లా ధరలు పెరుగుతున్నందున, దేశీయంగా లక్ష టన్నుల మేర ఉల్లిపాయలను అదనంగా నిల్వ ఉంచేందుకు రేడియేషన్ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉల్లిపాయలకు కొరత ఏర్పడనుందనే సమాచారంతోనే, ఒక్కసారిగా ధరలను పెంచేస్తున్నారు. వంటల్లోకి తప్పనిసరి కావడంతో, ఉల్లి ఘాటు ప్రతి కుటుంబానికి తగులుతోంది. రాజకీయంగా ఇది ప్రతికూల ప్రభావం చూపుతున్నందున, ప్రభుత్వం ఉల్లి నిల్వల పెంపుపై దృష్టి సారించింది. 2023-24లో ఉల్లి ఉత్పత్తి 16% తగ్గి, 25.47 మిలియన్ టన్నులకు పరిమితం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉల్లి ఉత్పత్తిలో ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో దిగుబడి తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. సరఫరా అవరోధాలతో తరచు ధరల్లో ఒడుదొడుకులు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించడంలో భాగంగా, ఉల్లిపాయల జీవితకాలాన్ని పెంచేందుకు రేడియేషన్ సాంకేతికత వాడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వినియోగదారు వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ‘ముఖ్య వినియోగ ప్రాంతాల చుట్టూ 50 ఇర్రేడియేషన్ కేంద్రాలను మేం గుర్తిస్తున్నాం. ఇది విజయవంతమైతే ఈ ఏడాది 1 లక్ష టన్నుల వరకు ఉల్లిపాయలను అదనంగా నిల్వ చేయగలుగుతాం’ అని ఖరే తెలిపారు. సోనెపట్, థానే, నాసిక్, ముంబయి లాంటి కీలక ప్రాంతాల చుట్టూ ఇర్రేడియేషన్ కేంద్రాలను గుర్తించే బాధ్యతను నాఫెడ్, ఎన్సీసీఎఫ్కు మంత్రిత్వ శాఖ అప్పగించిందని పేర్కొన్నారు. గతేడాది మహారాష్ట్రలో 1,200 టన్నుల ఉల్లి నిల్వలపై రేడియేషన్ ప్రాసెసింగ్కు ప్రయత్నించారు. ఉల్లి నిల్వలను అవసరమైన ప్రాంతాలకు వేగంగా రవాణా చేసేందుకు, ప్రధాన రైల్వే హబ్ల వద్ద ఉష్ణోగ్రత నియంత్రిత నిల్వ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని ఖరే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
Vodafone Idea: దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉండేలా వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ నెల రోజులు. -
రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. -
కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం
వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అనిశ్ షా తెలిపారు. -
నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే
నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. -
తాజా ఉత్తీర్ణులకు హుషారే
గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ యాంపీర్ నెక్సస్
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్ స్కూటర్ యాంపీర్ నెక్సస్ను ఆవిష్కరించింది. -
అవిన్యా బ్రాండ్పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు
టాటా మోటార్స్, ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. -
సంక్షిప్త వార్తలు(7)
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్ అంచనా. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన
-
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
-
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ
-
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
-
విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?: జగదీశ్ రెడ్డి
-
‘నీట్’ వివాదం.. సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి: సిబల్