Onion: లక్ష టన్నుల ఉల్లి నిల్వ లక్ష్యం
కొరత ఏర్పడినప్పుడల్లా ధరలు పెరుగుతున్నందున, దేశీయంగా లక్ష టన్నుల మేర ఉల్లిపాయలను అదనంగా నిల్వ ఉంచేందుకు రేడియేషన్ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రేడియేషన్తో సాధించేందుకు ప్రభుత్వ కసరత్తు
దిల్లీ: కొరత ఏర్పడినప్పుడల్లా ధరలు పెరుగుతున్నందున, దేశీయంగా లక్ష టన్నుల మేర ఉల్లిపాయలను అదనంగా నిల్వ ఉంచేందుకు రేడియేషన్ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉల్లిపాయలకు కొరత ఏర్పడనుందనే సమాచారంతోనే, ఒక్కసారిగా ధరలను పెంచేస్తున్నారు. వంటల్లోకి తప్పనిసరి కావడంతో, ఉల్లి ఘాటు ప్రతి కుటుంబానికి తగులుతోంది. రాజకీయంగా ఇది ప్రతికూల ప్రభావం చూపుతున్నందున, ప్రభుత్వం ఉల్లి నిల్వల పెంపుపై దృష్టి సారించింది. 2023-24లో ఉల్లి ఉత్పత్తి 16% తగ్గి, 25.47 మిలియన్ టన్నులకు పరిమితం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఉల్లి ఉత్పత్తిలో ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో దిగుబడి తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. సరఫరా అవరోధాలతో తరచు ధరల్లో ఒడుదొడుకులు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించడంలో భాగంగా, ఉల్లిపాయల జీవితకాలాన్ని పెంచేందుకు రేడియేషన్ సాంకేతికత వాడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వినియోగదారు వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. ‘ముఖ్య వినియోగ ప్రాంతాల చుట్టూ 50 ఇర్రేడియేషన్ కేంద్రాలను మేం గుర్తిస్తున్నాం. ఇది విజయవంతమైతే ఈ ఏడాది 1 లక్ష టన్నుల వరకు ఉల్లిపాయలను అదనంగా నిల్వ చేయగలుగుతాం’ అని ఖరే తెలిపారు. సోనెపట్, థానే, నాసిక్, ముంబయి లాంటి కీలక ప్రాంతాల చుట్టూ ఇర్రేడియేషన్ కేంద్రాలను గుర్తించే బాధ్యతను నాఫెడ్, ఎన్సీసీఎఫ్కు మంత్రిత్వ శాఖ అప్పగించిందని పేర్కొన్నారు. గతేడాది మహారాష్ట్రలో 1,200 టన్నుల ఉల్లి నిల్వలపై రేడియేషన్ ప్రాసెసింగ్కు ప్రయత్నించారు. ఉల్లి నిల్వలను అవసరమైన ప్రాంతాలకు వేగంగా రవాణా చేసేందుకు, ప్రధాన రైల్వే హబ్ల వద్ద ఉష్ణోగ్రత నియంత్రిత నిల్వ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని ఖరే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ