Tata Motors: టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది.
కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలపై..
2024-25కు ప్రణాళికలు
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)తో పాటు టాటా మోటార్స్ బ్రాండ్పై కొత్త ఉత్పత్తులు, సాంకేతికతల ఆవిష్కరణ కోసం 2024-25లో రూ.43,000 కోట్ల పెట్టుబడులు పెడతామని గ్రూప్ ప్రకటించింది.
2023-24లో ప్రణాళికల కంటే అధికంగా..
జేఎల్ఆర్కు రూ.30,000 కోట్ల (3 బిలియన్ పౌండ్ల) పెట్టుబడులు సమకూరుస్తామని, మరో రూ.8,000 కోట్లు టాటా మోటార్స్కు (మొత్తం రూ.38,000 కోట్లు) కేటాయిస్తామని టాటా మోటార్స్ గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో తన ప్రణాళికను ప్రకటించింది. అయితే జేఎల్ఆర్కు 3.3 బిలియన్ పౌండ్లు (రూ.33,000 కోట్ల కంటే ఎక్కువగా), టాటా మోటార్స్కు రూ.8,200 కోట్లు సమకూర్చినట్లు (మొత్తం రూ.41,200 కోట్లు) సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) పీబీ బాలాజీ, ఆర్థిక ఫలితాల అనంతర ఎర్నింగ్స్ సమావేశంలో వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి
ఈ ఆర్థిక సంవత్సరానికి వస్తే జేఎల్ఆర్కు పెట్టుబడులు మరో 6% పెంచి, 3.5 బిలియన్ పౌండ్లు (సుమారు రూ.35,000 కోట్లు) కేటాయిస్తున్నట్లు బాలాజీ తెలిపారు. కొత్త వాహనాల ఆవిష్కరణ.. ప్రణాళిక ప్రకారం జరిగేందుకే ఇంత మొత్తం కేటాయిస్తున్నట్లు వివరించారు. టాటా మోటార్స్కు సుమారు రూ.8,000 కోట్లు సమకూరుస్తామని పేర్కొన్నారు. అంటే మొత్తం రూ.43,000 కోట్ల మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు పెడతామని చెప్పారు.
రేంజ్ రోవర్ బీఈవీ ప్రత్యేకత ఇదీ
‘రేంజ్ రోవర్ బీఈవీని.. బ్యాటరీ విద్యుత్తు వాహనంగా విక్రయించం. దాన్ని రేంజ్ రోవర్గా మాత్రమే అమ్ముతాం. బీఈవీ ఇంజిన్ కలిగిన రేంజ్ రోవర్ ఇది’ అని రిచర్డ్ తెలిపారు.‘రేంజ్ రోవర్ బ్రాండ్కు తగిన విధంగా అధిక శక్తి కలిగి, నిశ్శబ్దంగా - ప్రశాంతంగా ప్రయాణించేందుకు అనువైన వాహనం ఇది. అందువల్ల రేంజ్ రోవర్లో హైఎండ్ మోడల్గా’ అభివర్ణించారు. రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్లో పలు ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయని, ఈ ఏడాదిలో డిఫెండర్ ఆక్టాను విడుదల చేస్తామని రిచర్డ్ పేర్కొన్నారు.
జేఎల్ఆర్ కొత్త మోడళ్లు 2025-26లో
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తమ కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తాయని జేఎల్ఆర్ సీఎఫ్ఓ రిచర్డ్ పేర్కొన్నారు. రేంజ్ రోవర్ బీఈవీ తో పాటు మరికొన్ని మోడళ్లు విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్న మోడళ్ల స్థానంలో కొత్త మోడళ్లు ప్రవేశ పెడతామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..