Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
Tata group- iphone: టాటా గ్రూప్ మరో అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దీనిద్వారా 50 వేల మందికి ఉపాధి లభించనుంది.
Tata group | ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ల (iphones) తయారీకి విస్ట్రాన్ ప్లాంట్ను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ (tata group) ఇప్పుడు మరో ప్లాంట్ నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటకలోని ఈ ప్లాంట్ కొనుగోలు ద్వారా ఐఫోన్లు తయారుచేసే తొలి భారత కంపెనీగా అవతరించిన టాటా గ్రూప్.. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. భారత్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్న యాపిల్ లక్ష్యానికి అనుగుణంగా టాటా గ్రూప్ ఈ అడుగులు వేస్తోంది. తమిళనాడులోని హోసూరులో ప్రతిపాదిత కొత్త ఫ్యాక్టరీ నెలకొల్పాలని భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు.
రెండేళ్లలోపే కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ప్లాంట్ కంటే పెద్ద ప్లాంట్ను నెలకొల్పి, తద్వారా సుమారు 50 వేల మందికి ఉపాధి కల్పించాలని టాటా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఇందులో 20 అసెంబ్లీ లైన్స్ ఉంటాయని తెలుస్తోంది. 12-18 నెలల్లోపే కొత్త ప్లాంట్లో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. చైనా నుంచి తన అసెంబ్లింగ్, విడిభాగాల తయారీని ఇతర దేశాలకు విస్తరించాలని భావిస్తున్న యాపిల్.. ఇందుకోసం భారత్, థాయ్లాండ్, మలేసియా దేశాల్లో ఉన్న భాగస్వాములతో కలిసి సప్లయ్ను పెంచాలని భావిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా టాటా కొత్త ప్లాంట్ను నెలకొల్పాలనుకుంటోంది. అయితే, దీనిపై అటు యాపిల్ గానీ, ఇటు టాటా ప్రతినిధి గానీ స్పందించలేదు.
RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
ప్రస్తుతం హోసూరులో ఐఫోన్ మెటల్ కేసింగ్ల తయారీ ప్లాంట్ సైతం టాటాల చేతిలోనే ఉంది. ఇక్కడా ఉత్పత్తిని పెంచేందుకు నియామకాలు చేపడుతోంది. కేవలం యాపిల్ ఫోన్ల అసెంబ్లింగ్కు మాత్రమే పరిమితం కాకుండా యాపిల్ ఉత్పత్తులతో కూడిన 100 రిటైల్ స్టోర్లు ఏర్పాటు చేయాలని కూడా టాటా గ్రూప్ చూస్తోంది. తన వంతుగా యాపిల్ ఇప్పటికే దేశంలో రెండు అతిపెద్ద రిటైల్ స్టోర్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరో మూడింటిని నెలకొల్పాలని చూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.