Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
Tata group- iphone: టాటా గ్రూప్ మరో అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దీనిద్వారా 50 వేల మందికి ఉపాధి లభించనుంది.
Tata group | ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ల (iphones) తయారీకి విస్ట్రాన్ ప్లాంట్ను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ (tata group) ఇప్పుడు మరో ప్లాంట్ నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. కర్ణాటకలోని ఈ ప్లాంట్ కొనుగోలు ద్వారా ఐఫోన్లు తయారుచేసే తొలి భారత కంపెనీగా అవతరించిన టాటా గ్రూప్.. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. భారత్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్న యాపిల్ లక్ష్యానికి అనుగుణంగా టాటా గ్రూప్ ఈ అడుగులు వేస్తోంది. తమిళనాడులోని హోసూరులో ప్రతిపాదిత కొత్త ఫ్యాక్టరీ నెలకొల్పాలని భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు.
రెండేళ్లలోపే కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ప్లాంట్ కంటే పెద్ద ప్లాంట్ను నెలకొల్పి, తద్వారా సుమారు 50 వేల మందికి ఉపాధి కల్పించాలని టాటా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఇందులో 20 అసెంబ్లీ లైన్స్ ఉంటాయని తెలుస్తోంది. 12-18 నెలల్లోపే కొత్త ప్లాంట్లో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. చైనా నుంచి తన అసెంబ్లింగ్, విడిభాగాల తయారీని ఇతర దేశాలకు విస్తరించాలని భావిస్తున్న యాపిల్.. ఇందుకోసం భారత్, థాయ్లాండ్, మలేసియా దేశాల్లో ఉన్న భాగస్వాములతో కలిసి సప్లయ్ను పెంచాలని భావిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా టాటా కొత్త ప్లాంట్ను నెలకొల్పాలనుకుంటోంది. అయితే, దీనిపై అటు యాపిల్ గానీ, ఇటు టాటా ప్రతినిధి గానీ స్పందించలేదు.
RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
ప్రస్తుతం హోసూరులో ఐఫోన్ మెటల్ కేసింగ్ల తయారీ ప్లాంట్ సైతం టాటాల చేతిలోనే ఉంది. ఇక్కడా ఉత్పత్తిని పెంచేందుకు నియామకాలు చేపడుతోంది. కేవలం యాపిల్ ఫోన్ల అసెంబ్లింగ్కు మాత్రమే పరిమితం కాకుండా యాపిల్ ఉత్పత్తులతో కూడిన 100 రిటైల్ స్టోర్లు ఏర్పాటు చేయాలని కూడా టాటా గ్రూప్ చూస్తోంది. తన వంతుగా యాపిల్ ఇప్పటికే దేశంలో రెండు అతిపెద్ద రిటైల్ స్టోర్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరో మూడింటిని నెలకొల్పాలని చూస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?