Tata Tech Listing: టాటా టెక్ బంపర్ లిస్టింగ్.. ఒక్కో లాట్పై రూ.21 వేల లాభం
Tata Tech Listing: టాటా టెక్ ఐపీఓ లిస్టింగ్ అంచనాలకు మించిన లాభాన్నించ్చింది. ఇష్యూ ధరతో పోలిస్తే 140 శాతం లాభంతో షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి.
Tata Tech Listing | ముంబయి: మదుపరుల నుంచి అనూహ్య స్పందనతో రికార్డు సృష్టించిన టాటా టెక్ ఐపీఓ షేర్లు నేడు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యాయి (Tata Tech Listing). అందరూ ఊహించినట్లుగానే బంపర్ లిస్టింగ్ నమోదు చేసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 140 శాతం లాభంతో షేర్లు ట్రేడింగ్ మొదలుపెట్టాయి.
టాటా టెక్ ఐపీఓ (Tata Tech IPO) ఇష్యూ ధర రూ.500 కాగా బీఎస్ఈలో షేరు ఈ రోజు రూ.1,200 దగ్గర లిస్టయ్యింది. ఒక్కో షేరుపై లిస్టింగ్లోనే రూ.700 లాభం రావడం విశేషం. ఈ లెక్కన ఐపీఓలో షేర్లు అలాట్ అయినవారు ఒక్కో లాట్ (30 షేర్లు)పై రూ.15 వేలు పెట్టుబడి పెట్టగా.. లిస్టింగ్ ధర వద్ద రూ.21 వేల లాభాన్ని ఆర్జించినట్లయింది. తర్వాత ఈ షేరు బీఎస్ఈలో రూ.1,400 దగ్గర ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. తర్వాత కొంచెం దిగొచ్చి ఉదయం 10:37 సమయంలో రూ.1,303.80 దగ్గర ట్రేడవుతోంది.
టాటా గ్రూప్ నుంచి రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన టాటా టెక్ ఐపీఓకు (Tata Tech IPO) ఊహించని రీతిలో స్పందన లభించిన విషయం తెలిసిందే. రూ.3042 కోట్ల సమీకరించేందుకు వచ్చిన ఈ ఐపీఓకు భారీ స్థాయిలో సబ్స్క్రిప్షన్ వచ్చింది. మొత్తం 4.5 కోట్ల షేర్లు సబ్స్క్రిప్షన్కు ఉంచగా.. చివరి రోజు పూర్తయ్యే సరికి 69.4 రెట్ల స్పందన లభించింది. మొత్తం 312.42 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.500 దగ్గర లెక్కిస్తే ఈ మొత్తం రూ.1.56 లక్షల కోట్లతో సమానం.
టాటా టెక్కు 18 అంతర్జాతీయ డెలివరీ కేంద్రాలున్నాయి. దాదాపు 11 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్, పరిశోధన-అభివృద్ధి (ఈఆర్అండ్డీ) సేవలు, డిజిటల్ ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ (డీఈఎస్), ఎడ్యుకేషన్ ఆఫరింగ్స్, వాల్యూ యాడెడ్ రీసెల్లింగ్ అండ్ ఐప్రోడక్ట్స్ ఆఫరింగ్స్ విభాగాల్లో వ్యాపారాలున్నాయి. టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్రోవర్ సహా టాటా గ్రూప్లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది.
గాంధార్ ఆయిల్ సైతం..
ఈ రోజు గాంధార్ ఆయిల్ రిఫైనరీ (ఇండియా) షేర్లు సైతం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.169తో పోలిస్తే బీఎస్ఈలో 75 శాతం లాభంతో రూ.295.40 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.298 దగ్గర ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఐపీఓలో షేర్లు అలాట్ అయినవారు 88 షేర్ల (ఒక లాట్)కు రూ.14,872 పెట్టుబడి పెట్టారు. వీరు ఒక్కో లాట్పై లిస్టింగ్ దగ్గర (బీఎస్ఈలో) రూ.11,123 లాభాన్ని ఆర్జించారు.
నవంబర్ 24న పూర్తయిన గాంధార్ ఆయిల్ ఐపీఓకు 64.07 రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే. 2.12 కోట్ల షేర్లు ఐపీఓలో సబ్స్క్రిప్షన్కు ఉంచగా.. 136.1 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీలో 129 రెట్లు, ఎన్ఐఐల నుంచి 62.23 రెట్లు, రిటైల్ మదుపర్ల నుంచి 28.95 రెట్ల స్పందన లభించింది. రూ.500.69 కోట్ల సమీకరణకు లక్ష్యంతో వచ్చిన ఈ ఇష్యూకు, రూ.23,000 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్