Tesla: ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థ ధరనూ కుదించిన టెస్లా
Tesla: ఇటీవలే చైనా, అమెరికా మార్కెట్లలో కార్ల ధరలను కుదించిన టెస్లా.. తాజాగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ధరను సైతం తగ్గించింది.
Tesla | న్యూయార్క్: ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD)’ వ్యవస్థ ధరను సైతం తగ్గించింది. 12,000 డాలర్ల నుంచి 8,000 డాలర్లకు కుదించింది. కార్లపైనా కంపెనీ 2,000 డాలర్ల వరకు ధరల్ని తగ్గించిన విషయం తెలిసిందే. చైనా మార్కెట్కూ ఆ నిర్ణయాన్ని వర్తింపజేసింది. ఇలా వరుసగా ధరలు తగ్గించటం.. ఇతర కంపెనీల నుంచి టెస్లా ఎదుర్కొంటున్న పోటీని సూచిస్తోందని వాహనరంగ నిపుణులు తెలిపారు.
ఇటీవల టెస్లా (Tesla) విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు పోటీ కూడా తీవ్రమవుతుండటంతో కస్టమర్లను ఆకర్షించేందుకు టెస్లా ధరల కోత వ్యూహాన్ని అనుసరిస్తోంది. టెస్లా షేరు విలువ శుక్రవారం 150 డాలర్ల దిగువకు కుంగింది. 2024లో కంపెనీ స్టాక్ ధర ఇప్పటివరకు 40 శాతం మేర కుంగడం గమనార్హం. ఈ తరుణంలో కార్లు సహా ఎఫ్ఎస్డీ ధరలను తగ్గించడం గమనార్హం.
అమెరికా సహా వివిధ మార్కెట్లలో ఖరీదైన కార్లపై వెచ్చించడానికి కస్టమర్లు వెనకాడుతున్నారు. అధిక వడ్డీరేట్లే దీనికి కారణం. దీంతో టెస్లా (Tesla).. పాత కార్లను పెద్దగా అప్గ్రేడ్ చేయడం లేదు. అదే సమయంలో చైనాలో వివిధ కంపెనీలు అందుబాటు ధరలో కొత్త ఈవీ మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. విక్రయాలు కుంగడం, పోటీ పెరగడంతో టెస్లా కొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. మరోవైపు వ్యయ నియంత్రణ చర్యలను సైతం చేపట్టింది. అందులోభాగంగా ఇటీవల 10 శాతం ఉద్యోగులను తొలగించింది.
ఏంటీ ఎఫ్ఎస్డీ?
టెస్లా మోడల్ కార్లన్నీ ‘ఆటో పైలట్’ మోడ్ ఫీచర్తో వస్తాయి. ఇది ఒక డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థ. ట్రాఫిక్ను బట్టి వేగాన్ని నియంత్రించడం, నిర్దిష్ట వరుసలోనే వెళ్లేలా కమాండ్ ఇవ్వడం వంటివాటిని కారు దానికదే చేసుకుంటుంది. ఈ ఆటోపైలట్ను మరింత అధునాతనంగా తీర్చిదిద్ది ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ సిస్టమ్ను తీసుకొచ్చారు. దీంట్లో డ్రైవర్ ప్రమేయం లేకుండానే పరిస్థితులకు అనుగుణంగా కారు కొన్ని పనులను సొంతంగా నిర్వహిస్తుంది. రోడ్డుపై ఒక వరుస నుంచి ఇంకో వరుసకు మారడం, పార్కింగ్, మొబైల్ యాప్తో కారును మూవ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ను గుర్తించి తదనుగుణంగా నడుచుకోవడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది.
కారు చుట్టూ ఉండే కెమెరాలు, అల్ట్రాసౌండ్ సెన్సర్ల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇవి కారులో ఉండే సాఫ్ట్వేర్కు అనుసంధానమై ఉంటాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి కావాల్సిన ఔట్పుట్ను ఇస్తుంది. అందుకు అనుగుణంగా కారు ముందుకెళ్తుంది. అయితే, డ్రైవర్ పర్యవేక్షణ మాత్రం తప్పనిసరి. ఏ క్షణంలోనైనా కారు సాఫ్ట్వేర్ దెబ్బతిని ప్రమాదాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. ఆ సమయంలో డ్రైవర్ వెంటనే కారును తన అధీనంలోకి తీసుకునేందుకు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. కేవలం డ్రైవర్పై ఒత్తిడిని తగ్గించడం, భద్రతను మెరుగుపర్చడంలో భాగంగానే ఎఫ్ఎస్డీని అభివృద్ధి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
Noise Pop Buds: నాయిస్ మరో ట్రూవైర్లెస్ ఇయర్ఫోన్స్ను భారత్లో విడుదల చేసింది. క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. -
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 453 పాయింట్ల లాభంతో 75,064 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 135 పాయింట్లు పుంజుకొని 22,783 దగ్గర కొనసాగుతోంది. -
కోపోర్జ్ చేతికి సిగ్నిటీ టెక్నాలజీస్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ను, దేశీయ ఐటీ రంగ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కోఫోర్జ్ లిమిటెడ్ (గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్) సొంతం చేసుకోనుంది. -
పన్ను రాయితీలను ‘ఊహాజనిత నష్టం’గా ఎలా పరిగణిస్తారు?
ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలను, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) ‘ఊహాజనిత నష్టం’ గా ఎలా నిర్ణయిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు. -
మన ఎలక్ట్రానిక్స్లో చైనా, హాంకాంగ్ నుంచే 56%
గత ఆర్థిక సంవత్సరంలో మన ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగుమతులు 89.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.45 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
సేవల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయ్
మన దేశం నుంచి సేవల ఎగుమతులు, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 1.3% తగ్గి 30 బిలియన్ డాలర్ల (సుమరు రూ.2.5 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ గురువారం తెలిపింది. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
నష్టాల నుంచి లాభాల్లోకి
ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవ్వడం, సానుకూల తయారీ గణాంకాల మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్ను బలోపేతం చేశాయి. -
రాణించిన డాబర్ ఇండియా
డాబర్ ఇండియా, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.341.22 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.292.76 కోట్ల కంటే ఇది 16.55% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.2,677.80 కోట్ల నుంచి 5.11% పెరిగి రూ.2,814.6 4 కోట్లకు చేరింది. -
బియ్యం, డెయిరీ ఉత్పత్తులపైనా నిఘా
దేశీయ మార్కెట్లో విక్రయమయ్యే పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్), డెయిరీ ఉత్పత్తులు, మసాలాలపై నిఘా పెట్టాలని ఆహార నియంత్రణాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ భావిస్తోంది. -
‘కొవాగ్జిన్’ ఆవిష్కరణలో భద్రతకే పెద్దపీట
టీకా తీసుకున్న ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ‘కొవాగ్జిన్’ టీకాను రూపొందించినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ గురువారం వెల్లడించింది. ‘ఏదైనా టీకా ప్రభావం కొంతకాలమే ఉండొచ్చు, కానీ రోగుల భద్రత ఎంతో ముఖ్యం. -
కోల్ ఇండియా లాభంలో 26% వృద్ధి
కోల్ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.8,682.20 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.6,875.07 కోట్ల కంటే ఇది 26.2% అధికం. -
37% తగ్గిన అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం
అదానీ ఎంటర్ప్రైజెస్, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.450.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.722.48 కోట్లతో పోలిస్తే ఇది 37% తక్కువ. -
జీఎస్టీ నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం
రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీ ఉన్నతాధికారుల 3వ జాతీయ సమన్వయ సమావేశం శుక్రవారం జరగనుంది. -
సంక్షిప్త వార్తలు( 7)
ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల సంస్థ అవేవా, హైదరాబాద్లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇటువంటి కేంద్రాల్లో ఇది ఆరోది. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
అప్పు చేసి ఇల్లు కొంటున్నారా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం తీసుకుంటాం. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నవారూ.. ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి, పెద్దది తీసుకోవాలనుకున్నా. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
క్రెడిట్ కార్డు.. ఇలా తీసుకుందాం
క్రెడిట్ కార్డులు మన రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో ఒక భాగం అయ్యాయి. ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసమూ వీటిని ఉపయోగించుకునేందుకు వీలవుతోంది. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు