Tesla: ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థ ధరనూ కుదించిన టెస్లా
Tesla: ఇటీవలే చైనా, అమెరికా మార్కెట్లలో కార్ల ధరలను కుదించిన టెస్లా.. తాజాగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ధరను సైతం తగ్గించింది.
Tesla | న్యూయార్క్: ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD)’ వ్యవస్థ ధరను సైతం తగ్గించింది. 12,000 డాలర్ల నుంచి 8,000 డాలర్లకు కుదించింది. కార్లపైనా కంపెనీ 2,000 డాలర్ల వరకు ధరల్ని తగ్గించిన విషయం తెలిసిందే. చైనా మార్కెట్కూ ఆ నిర్ణయాన్ని వర్తింపజేసింది. ఇలా వరుసగా ధరలు తగ్గించటం.. ఇతర కంపెనీల నుంచి టెస్లా ఎదుర్కొంటున్న పోటీని సూచిస్తోందని వాహనరంగ నిపుణులు తెలిపారు.
ఇటీవల టెస్లా (Tesla) విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు పోటీ కూడా తీవ్రమవుతుండటంతో కస్టమర్లను ఆకర్షించేందుకు టెస్లా ధరల కోత వ్యూహాన్ని అనుసరిస్తోంది. టెస్లా షేరు విలువ శుక్రవారం 150 డాలర్ల దిగువకు కుంగింది. 2024లో కంపెనీ స్టాక్ ధర ఇప్పటివరకు 40 శాతం మేర కుంగడం గమనార్హం. ఈ తరుణంలో కార్లు సహా ఎఫ్ఎస్డీ ధరలను తగ్గించడం గమనార్హం.
అమెరికా సహా వివిధ మార్కెట్లలో ఖరీదైన కార్లపై వెచ్చించడానికి కస్టమర్లు వెనకాడుతున్నారు. అధిక వడ్డీరేట్లే దీనికి కారణం. దీంతో టెస్లా (Tesla).. పాత కార్లను పెద్దగా అప్గ్రేడ్ చేయడం లేదు. అదే సమయంలో చైనాలో వివిధ కంపెనీలు అందుబాటు ధరలో కొత్త ఈవీ మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. విక్రయాలు కుంగడం, పోటీ పెరగడంతో టెస్లా కొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. మరోవైపు వ్యయ నియంత్రణ చర్యలను సైతం చేపట్టింది. అందులోభాగంగా ఇటీవల 10 శాతం ఉద్యోగులను తొలగించింది.
ఏంటీ ఎఫ్ఎస్డీ?
టెస్లా మోడల్ కార్లన్నీ ‘ఆటో పైలట్’ మోడ్ ఫీచర్తో వస్తాయి. ఇది ఒక డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థ. ట్రాఫిక్ను బట్టి వేగాన్ని నియంత్రించడం, నిర్దిష్ట వరుసలోనే వెళ్లేలా కమాండ్ ఇవ్వడం వంటివాటిని కారు దానికదే చేసుకుంటుంది. ఈ ఆటోపైలట్ను మరింత అధునాతనంగా తీర్చిదిద్ది ‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ సిస్టమ్ను తీసుకొచ్చారు. దీంట్లో డ్రైవర్ ప్రమేయం లేకుండానే పరిస్థితులకు అనుగుణంగా కారు కొన్ని పనులను సొంతంగా నిర్వహిస్తుంది. రోడ్డుపై ఒక వరుస నుంచి ఇంకో వరుసకు మారడం, పార్కింగ్, మొబైల్ యాప్తో కారును మూవ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ను గుర్తించి తదనుగుణంగా నడుచుకోవడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది.
కారు చుట్టూ ఉండే కెమెరాలు, అల్ట్రాసౌండ్ సెన్సర్ల ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇవి కారులో ఉండే సాఫ్ట్వేర్కు అనుసంధానమై ఉంటాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి కావాల్సిన ఔట్పుట్ను ఇస్తుంది. అందుకు అనుగుణంగా కారు ముందుకెళ్తుంది. అయితే, డ్రైవర్ పర్యవేక్షణ మాత్రం తప్పనిసరి. ఏ క్షణంలోనైనా కారు సాఫ్ట్వేర్ దెబ్బతిని ప్రమాదాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. ఆ సమయంలో డ్రైవర్ వెంటనే కారును తన అధీనంలోకి తీసుకునేందుకు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. కేవలం డ్రైవర్పై ఒత్తిడిని తగ్గించడం, భద్రతను మెరుగుపర్చడంలో భాగంగానే ఎఫ్ఎస్డీని అభివృద్ధి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు