Budget 2024: భారత తొలి బడ్జెట్.. ఈ ఆసక్తికర విశేషాలు తెలుసా?
దేశ తొలి బడ్జెట్ను అధికార పక్షంలోని వ్యక్తి కాకుండా.. మరో పార్టీ నేత ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఓ రంగానికి దాదాపు సగం కేటాయింపులు చేశారు. తొలి బడ్జెట్ విశేషాలు..
ఇంటర్నెట్డెస్క్: భారత తొలి బడ్జెట్ (Union Budget 2024)లో చాలా విశేషాలున్నాయి. ఈ బడ్జెట్ రహస్యాల లీక్ కారణంగా సీనియర్ మంత్రి రాజీనామా వంటి పరిణామాలు చోటు చేసుకొన్నాయి. 1947-48కి సంబంధించిన తొలి బడ్జెట్ను ఆర్.షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. ఆయన కాంగ్రెస్ నేత కాదు. బ్రిటిష్ అనుకూల పార్టీగా పేరున్న జస్టిస్ పార్టీ నేత. ఆయన ఓ పారిశ్రామిక వేత్త కూడా. కొచ్చిన్ స్టేట్ దివాన్గా పనిచేశారు. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్కు సలహాదారుగా వ్యవహరించారు.
- తొలి బడ్జెట్ను 1947 నవంబర్ 26వ తేదీన ప్రవేశపెట్టారు. దీనిలో దేశ వ్యయం రూ.197.39 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఇందులో అత్యధికంగా రూ.92.74 కోట్లు (46శాతం) రక్షణ రంగానికే కేటాయించారు. దేశ ఆదాయం రూ.171 కోట్లు ఉంటుందని అంచనావేశారు. ఈ బడ్జెట్లో రూ. 24.59 కోట్ల ద్రవ్య లోటును చూపించారు.
- అప్పట్లో బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. ఎందుకంటే బ్రిటన్లోని రాజకీయ నాయకులు, సభ్యులు కూడా సౌకర్యవంతంగా దీనిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. బ్రిటన్కు అప్పుడు మధ్యాహ్న సమయం అవుతుంది.
- తొలి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే.. యూకే ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్చెకర్ (ఆర్థిక మంత్రి హోదా) హూ డాల్టన్ భారత బడ్జెట్లోని కీలకమైన పన్ను మార్పులను లీక్ చేశాడు. ఆయన ఓ జర్నలిస్ట్కు ఈ విషయాలను పిచ్చాపాటీ మాటల్లో చెప్పాడు. దీంతో సదరు విలేకరి మర్నాడు బడ్జెట్ ప్రతిపాదనలతో ఓ వార్తను ప్రచురించాడు. ఈ ఘటన తర్వాత హూ డాల్టన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
- భారత బడ్జెట్లో గోప్యత అత్యంత కీలకమైంది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో ఆర్థిక శాఖలోని కీలక ఉద్యోగులు కొన్ని రోజులపాటు ఇళ్లకు కూడా వెళ్లరు. వారు కార్యాలయాలకే పరిమితమైపోతారు. వారి వద్దకు ఎవరినీ వెళ్లనీయరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్