Online shopping: ఈ నగరంలోనే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ.. ఆదాయంలో 16శాతం దీనికే
online shopping: కరోనా వ్యాపించిన సమయంలో ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ షాపింగ్ యాప్లను ఏ నగర వాసులు అత్యధిక సమయాన్ని వెచ్చిస్తున్నారో తెలుసా?
ఇంటర్నెట్డెస్క్: భారత్లో ఆన్లైన్ షాపింగ్ (online shopping) చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. మన దేశంలో అమెజాన్ (Amazon), మీషో (Meesho)తో పాటు ఇతర షాపింగ్ యాప్లలో ఏ నగర ప్రజలు అత్యధిక సమయాన్ని వెచ్చిస్తున్నారో తెలుసా? మన ఐటీ హబ్ బెంగళూరు వాసులు దీనిలో ముందున్నారు. ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్ఫాం అమెజాన్లో అత్యధిక సమయం గడిపే నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.
సైబర్ మీడియా రీసర్చ్ (CMR) చేపట్టిన తాజా పరిశోధనలో ఆన్లైన్ షాపింగ్పై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరు వాసులే అమెజాన్లో అధిక సమయం వెచ్చిస్తున్నారని పేర్కొంది. ఈ నగర ప్రజలు సగటున వారానికి నాలుగు గంటల రెండు నిమిషాలు దీనికి కేటాయిస్తున్నారని తన పరిశోధన ద్వారా వెల్లడించింది. ఇక ద్వితీయశ్రేణి నగరాల విషయానికొస్తే గువాహటి (Guwahati), కోయంబత్తూర్ (Coimbatore), లఖ్నవు (Lucknow) నగరవాసలు కూడా ఆన్లైన్ షాపింగ్కు అధిక సమయం వెచ్చిస్తున్నారు. వీరు సగటున రెండు గంటల 25 నిమిషాలు గడుపుతున్నారు. ఈ సమయంలో వారు తమ ఆదాయంలో 16 శాతం వరకు ఇక్కడ ఖర్చుచేస్తున్నట్లు తేలింది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ (Flipkart), మీషో, టాటా (Tata), రిలయన్స్ (Reliance) ఫ్లాట్ఫాంమ్లు ఆన్లైన్ షాపింగ్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక, ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను పెంచుకోవటంలో అమెజాన్ ముందంజలో ఉన్నట్లు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానంలో ఫ్లిప్కార్ట్ (Flipkart) నిలిచింది. మహిళా వ్యాపారవేత్తలతో సహా ఇతరులూ ఈ-కామర్స్ సైట్లు లేదా యాప్స్లో ఏడాదికి సుమారు 149 గంటలు వెచ్చిస్తున్నట్లు తెలిపింది. వీరిలో 29 శాతం మంది ఆన్లైన్లో రూ.15,000 నుంచి 20,000 ధరల శ్రేణిలో స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. టైర్-2 నగరాల్లోని ప్రజలు గత ఆరు నెలల్లో సగటున రూ.20,100 ఆన్లైన్ షాపింగ్కే ఖర్చు చేస్తుంటే, టైర్-1 నగరాల్లోని కొనుగోలుదారులు రూ.21,700 ఖర్చు చేస్తున్నారు.
ఇక ఉత్పత్తుల విషయానికొస్తే.. దుస్తులు, యాక్సెసరీస్ను ఎక్కువ మంది ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మూడో స్థానంలో నిలిచాయి. ఇక, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో.. స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. విద్యుత్తు ఉపకరణాలు ఎక్కువగా కొంటున్న నగరాల్లో నాగ్పుర్ (Nagpur) మొదటి స్థానంలో ఉంది. 18-30 ఏళ్ల మధ్య వయసున్న వారు 47శాతం, 23-45 ఏళ్ల మధ్య వయసున్న వారు 51శాతం ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. గత ఆరునెలల్లో టైర్-2, టైర్-1 నగరాల్లోని 73 శాతం ప్రజలు అమెజాన్లోనే షాపింగ్ చేశారని అధ్యయనంలో తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్