Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?
Digital Payments: ఆన్లైన్ మోసాలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ సరికొత్త విధానంపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి ఆన్లైన్ లావాదేవీకి నాలుగు గంటల వ్యవధి పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీల (Online transactions) మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్థాయి మొత్తానికి మించి జరిగే తొలి లావాదేవీని నిర్దిష్ట సమయం పాటు నిలిపి ఉంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే ఆ సమయంలో ట్రాన్సాక్షన్ను రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు కీలక ప్రభుత్వ అధికారులు వెల్లడించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక కథనంలో పేర్కొంది.
ఈ కొత్త విధానం వల్ల డిజిటల్ లావాదేవీ (Digital Payments)ల విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ.. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఈ చర్య తప్పదనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు గంటల వ్యవధి తర్వాతే ట్రాన్సాక్షన్ను ప్రాసెస్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, రిటైల్ లావాదేవీల్లో ఇబ్బంది లేకుండా రూ.2,000 కంటే ఎక్కువ మొత్తం చెల్లింపులకు మాత్రమే నాలుగు గంటల వ్యవధి నిబంధనను వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది.
ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్తో పాటు యూపీఐ చెల్లింపుల (UPI transfers)కు కూడా ఈ కొత్త నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్లకు ఈ నిబంధన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కొత్తగా యూపీఐ ఖాతా తెరిచినప్పుడు తొలి 24 గంటల్లో కేవలం రూ.5,000 చెల్లింపునకు మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే నెఫ్ట్లో తొలి 24 గంటల్లో రూ.50,000 మాత్రమే పంపగలం.
కానీ, తాజాగా ప్రభుత్వ యోచనలో ఉన్న ప్రణాళిక ప్రకారం గత చరిత్రతో సంబంధం లేకుండా.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తొలి లావాదేవీలన్నింటికీ (రూ.2,000 దాటితే మాత్రమే) నాలుగు గంటల వ్యవధి నిబంధనను వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నిబంధనపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని అధికారులు తెలిపారు. కానీ, ఇటీవల యూకో బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో పొరపాటున రూ.820 కోట్లు జమ అయిన ఉదంతంతో ప్రభుత్వం అప్రమత్తమయినట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత