Cab Services: రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
Cab Services: అదనంగా డబ్బులు వసూలు చేసినందుకుగాను ఉబర్ ఇండియాకు కన్జ్యూమర్ కమిషన్ రూ.28 వేలు జరిమానా విధించింది.
చండీగఢ్: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ ఇండియాకు ఇటీవల ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్- చండీగఢ్’ రూ.28,000 జరిమానా విధించింది. ఓ ప్రయాణికుడి నుంచి క్యాబ్ డ్రైవర్ రూ.27 అదనంగా తీసుకోవడమే దీనికి కారణం.
అదనంగా తీసుకున్న రూ.27తో పాటు ఫిర్యాదుదారు రిత్విక్గార్గ్కు రూ.5,000 పరిహారం, రూ.3,000 ఖర్చుల కింద చెల్లించాలని ఉబర్ ఇండియాను కమిషన్ ఆదేశించింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలను అడ్డుకునేందుకు కమిషన్ లీగల్ ఎయిడ్ ఖాతాలో రూ.20,000 జమ చేయాలని తెలిపింది. కస్టమర్ల సమయాన్ని దృష్టిలోఉంచుకొని ఉదారంగా వ్యవహరించాల్సింది పోయి.. ఇలా వ్యవహరించడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.
పంజాబ్కు చెందిన గార్గ్.. 2022 సెప్టెంబరు 19న చండీగఢ్లో క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో యాప్లో ఛార్జీ రూ.53గా చూపించింది. డ్రైవర్ మాత్రం ఏవేవో నిబంధనలు చెప్పి రూ.80 వసూలు చేశాడు. ఈ విషయాన్ని లీగల్ నోటీసులు, మెయిల్స్ ద్వారా ఉబర్ ఇండియా దృష్టికి తీసుకెళ్లగా కంపెనీ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చింది. తాము యాప్ రూపంలో కేవలం టెక్నాలజీ సర్వీస్ మాత్రమే ఇస్తామని చెప్పుకొచ్చింది. డ్రైవర్లు, కస్టమర్లను అనుసంధానించడమే తమ లక్ష్యమని తెలిపింది. ప్రయాణ సేవలు అందించడం తమ పని కాదని పేర్కొంది. నిజమైన సర్వీస్ డ్రైవర్లదేనంటూ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చింది.
ఉబర్ ఇండియా సమాధానంపై కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. డ్రైవర్ అధికంగా వసూలు చేస్తున్నాడని తెలిసి కూడా అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదని తేల్చింది. కస్టమర్ చెల్లించే డబ్బుల్లో కొంత ఉబర్కు వెళ్తున్న నేపథ్యంలో కచ్చితంగా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. డ్రైవర్ల ప్రవర్తన సక్రమంగా ఉందో, లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత కంపెనీదేనని తేల్చి చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చివరి అరగంటలో అమ్మేశారు.. సూచీలకు నష్టాలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. -
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
Gold: మార్చిలో బంగారం ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జనవరి-మార్చి త్రైమాసికంలో గిరాకీ ఎనిమిది శాతం పుంజుకుంది. -
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
విప్రో కొత్త సీఈఓగా ఇటీవల నియమితులైన శ్రీనివాస్ పల్లియా వేతనం వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. -
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్ను తీసుకొచ్చింది. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
Elon Musk: టెస్లా షేర్ల ర్యాలీతో బిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఆయన షేర్ల విలువ 18.5 బిలియన్ డాలర్లు ఎగసింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668
Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 దగ్గర కొనసాగుతోంది. -
పతంజలి దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు
Patanjali: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పది ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేసింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది.