UPI చెల్లింపుల్లో కొత్త మార్పులు.. నేటి నుంచే!
UPI Transactions: దేశంలో చెల్లింపుల విధానాన్నే మార్చేసిన యూపీఐ వ్యవస్థలో నేటి నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. అవేంటో చూద్దాం..!
దిల్లీ: ‘యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)’.. దేశంలో చెల్లింపుల విధానాన్నే మార్చివేసింది. స్వల్పకాలంలోనే అత్యధిక మంది వినియోగిస్తున్న చెల్లింపుల సాధనంగా మారింది. ఈ క్రమంలో యూపీఐ వినియోగాన్ని మరింత విస్తరించేలా ఆర్బీఐ 2024 జనవరి 1 నుంచి కొన్ని కీలక మార్పులను అమల్లోకి తీసుకొచ్చింది. అవేంటో చూద్దాం..
- యూపీఐ ద్వారా చేసే ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని జనవరి నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు RBI గతంలో ప్రకటించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ల సబ్స్క్రిప్షన్తో పాటు కొన్ని విభాగాలకు ఈ చెల్లింపు పరిమితి రూ.15,000గా ఉంది. బీమా ప్రీమియం చెల్లింపులు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులకూ ఈ పరిమితి పెంపు వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. కార్డులు, ప్రీపెయిడ్ చెల్లింపు పద్ధతులు, యూపీఐలపై ఇ-మ్యాండేట్లు/స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ల ప్రాసెసింగ్లకు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) సడలింపు ఉంటుంది.
- ఇప్పటి వరకు ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ (UPI payments) ద్వారా ఒకసారి రూ.1 లక్ష వరకు చెల్లించేందుకు అనుమతి ఉండేది. ఇకపై దీన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ఫలితంగా ఆయా చోట్ల యూపీఐ ద్వారా భారీ మొత్తం చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభిస్తుంది.
- ఏడాది కంటే ఎక్కువ సమయం నుంచి యూపీఐ ఐడీలు, నంబర్లు వినియోగంలో లేకపోతే.. అవన్నీ డియాక్టివేట్ కానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) గత నవంబర్లోనే ఉత్తర్వులు జారీ చేసింది.
- డిజిటల్ వాలెట్లు లేదా ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI)’ను ఉపయోగించి చేసే యూపీఐ చెల్లింపులపై (UPI Transactions) 1.1 శాతం ఇంటర్ఛేంజ్ ఛార్జీ వర్తించనుంది. రూ.2,000 పైన చేసే మర్చంట్ లావాదేవీలపై మాత్రమే ఈ తరహా ఛార్జీలను విధిస్తారు. బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు లేదా సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎన్పీసీఐ స్పష్టం చేసింది.
- ఇకపై యూపీఐ యాప్ల నుంచి ఎవరికి చెల్లింపులు చేసినా.. వారి బ్యాంకు ఖాతాలో ఉండే పూర్తి పేరు తెరపై కనిపిస్తుంది. తప్పుడు లావాదేవీలకు అరికట్టేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఆర్బీఐ జపాన్కు చెందిన హిటాచీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఫలితంగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. ఈ తరహా ఏటీఎంలు దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
- త్వరలో యూపీఐ ‘ట్యాప్ అండ్ పే’ విధానాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తామని ఎన్పీసీఐ ఆ మధ్య ప్రకటించింది. అంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా ఫోన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. అయితే, దీనికి ఫోన్లో ‘నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC)’ ఫీచర్ అందుబాటులో ఉండాలి.
- యూపీఐ ద్వారా కొత్తవారికి చేసే తొలి చెల్లింపు మొత్తం రూ.2,000 దాటితే.. లావాదేవీ పూర్తి కావడానికి నాలుగు గంటల సమయం పట్టేలా మార్పులు చేసే యోచనలో ఎన్పీసీఐ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మోసపూరిత లావాదేవీలను అరికట్టడంలో భాగంగానే ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్