Hello! UPI: ఏప్రిల్ నుంచి ‘హలో! యూపీఐ’.. వాయిస్ కమాండ్తోనే లావాదేవీలు!
Hello! UPI: సంభాషణల ద్వారా చెల్లింపుల ఫీచర్ను తీసుకురానున్నట్లు సెప్టెంబర్లోనే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఏప్రిల్ నుంచి అవి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
Hello! UPI | ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ చెల్లింపుల (UPI Payments)ను మరింత సులభతరం చేయడం కోసం ఆర్బీఐ అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా వాయిస్ కమాండ్ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెడుతున్నట్లు సెప్టెంబర్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొత్త సదుపాయం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ తాజాగా ఉత్వర్తులు జారీ చేసింది. ‘హలో! యూపీఐ (Hello! UPI)’ ఫీచర్ను మార్చి 31 నాటికి యాప్లలో అందుబాటులోకి తేవాలని సూచించింది.
చెల్లింపుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగానే ‘హలో! యూపీఐ (Hello! UPI)’ ఫీచర్ను తీసుకొస్తున్నట్లు ఎన్పీసీఐ బ్యాంకులకు పంపిన మార్గదర్శకాల్లో పేర్కొంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, కొత్త యూజర్ల చేరిక, లావాదేవీలు, ఫిర్యాదుల పరిష్కారం.. ఇలా అన్నీ సంభాషణల ద్వారానే జరిగేలా యాప్లలో మార్పులు తీసుకురావాలని సూచించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న యాప్లన్నీ ఈ మార్పులు చేయాలని చెప్పింది.
‘హలో! యూపీఐ (Hello! UPI)’ సహా UPI, UPI లైట్ X, ట్యాప్ అండ్ పే, బిల్పే కనెక్ట్ వంటి కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు సెప్టెంబర్లో జరిగిన ‘గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2023’లో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)’ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ‘హలో! యూపీఐ (Hello! UPI)’ ఫీచర్తో యూజర్లు వాయిస్ కమాండ్లతో లావాదేవీలను పూర్తి చేసే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, లేదా కీప్యాడ్ ద్వారా ఎంటర్ చేసి లావాదేవీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు