Apple: యాపిల్పై అమెరికా ప్రభుత్వ దావా.. రూ.9.4 లక్షల కోట్లు ఆవిరి!
US sues Apple: యాపిల్ గుత్తాధిపత్యం సాధిస్తోందంటూ అమెరికా ప్రభుత్వం దావా వేసింది. దీంతో కంపెనీ షేరు విలువ పతనమైంది.
US sues Apple | వాషింగ్టన్: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్పై (Apple) అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ఫోన్ విపణిలో ఈ సంస్థ అక్రమంగా గుత్తాధిపత్యం సాధిస్తోందని ఆరోపించింది. ఫలితంగా కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పతనమయ్యాయి.
ఇవీ ఆరోపణలు..
యాపిల్ (Apple) తన ఏకపక్ష విధానాలతో గుత్తాధిపత్యం సాధించి పోటీ సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని దావాలో ప్రభుత్వం ఆరోపించింది. తద్వారా ధరలను కృత్రిమంగా పెంచుతోందని పేర్కొంది. ఫలితంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోతోందని తెలిపింది. న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో అగ్రరాజ్య జస్టిస్ డిపార్ట్మెంట్ వేసిన ఈ దావాలో 15 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంతకం చేశాయి. ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న గూగుల్, మెటా, అమెజాన్ సరసన తాజాగా యాపిల్ కూడా చేరింది. యూరప్లోనూ ఈ ఐఫోన్ తయారీ కంపెనీపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
షేర్లు ఢమాల్..
ఈ పరిణామాల నేపథ్యంలో యాపిల్ షేర్లు పతనమయ్యాయి. దాదాపు 4.1 శాతం మేర నష్టాల్లోకి జారుకున్నాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే 113 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9.41 లక్షల కోట్లు) ఆవిరైంది. ఈ ఏడాది కంపెనీ షేరు విలువ 11 శాతం వరకు కుంగడం గమనార్హం. మూడు ట్రిలియన్ డాలర్ల సంపదతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ నిలిచిన విషయం తెలిసిందే.
యాపిల్ స్పందనిదే..
ప్రభుత్వ దావాను యాపిల్ (Apple) కొట్టిపారేసింది. అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపింది. ఇలాంటి చర్యలతో ప్రభుత్వం ప్రమాదకర సంప్రదాయాన్ని నెలకొల్పుతోందని ఆరోపించింది. ప్రజల కోసం రూపొందిస్తున్న సాంకేతికతల అభివృద్ధి ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని పేర్కొంది. ఇలాంటి దావాలు యాపిల్ ఉత్పత్తులు మార్కెట్లో నెలకొల్పిన ప్రమాణాలకు ముప్పు తలపెడతాయని అభిప్రాయపడింది. వీటిని సమర్థంగా ఎదుర్కొంటామని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు