Stock Market: లోయర్ సర్క్యూట్కు వొడాఫోన్ ఐడియా, పేటీఎం షేర్లు
Stock Market: వొడాఫోన్ ఐడియా షేర్లు 10 శాతం, పేటీఎం షేర్లు ఐదు శాతం మేర నష్టపోయి లోయర్ సర్క్యూట్ను తాకాయి.
దిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ షేర్లు (Vodafone Idea shares) బుధవారం 10 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో రూ.14.29 దగ్గర లోయర్ సర్క్యూట్ను తాకాయి. రూ.45,000 కోట్ల నిధుల సమీకరణకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. అయినప్పటికీ.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగవ్వకపోవడం గమనార్హం.
ప్రతిపాదిత నిధుల సమీకరణలో రూ.20,000 కోట్లు ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పద్ధతుల్లో సమకూర్చుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. దీంట్లో ప్రమోటర్లు కూడా పాల్గొనున్నారు. మొత్తంగా ఈక్విటీ, డెట్ ద్వారా దాదాపు రూ.45,000 కోట్లు సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు బ్యాంకర్లు, కౌన్సిల్ను నియమించేందుకు కంపెనీకి బోర్డు అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాకు రూ.2.1 లక్షల కోట్ల రుణభారం ఉంది. చందాదారుల సంఖ్య భారీగా తగ్గడంతో నష్టాలను చవిచూస్తోంది. ప్రస్తుతం కంపెనీ బ్యాంక్ రుణాలు రూ.4,500 కోట్ల కంటే తక్కువగానే ఉన్నాయి. నిధుల సమీకరణ వల్ల కంపెనీ 4జీ కవరేజీ పెంచడం, 5జీ నెట్వర్క్ సేవల ప్రారంభం, సామర్థ్యాల విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టడం సాధ్యపడుతుందని కంపెనీ వెల్లడించింది.
పేటీఎం సైతం..
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న పేటీఎం షేర్లు (Paytm shares) సైతం బుధవారం ఐదు శాతం నష్టపోయాయి. బీఎస్ఈలో రూ.406.15 దగ్గర లోయర్ సర్క్యూట్ని తాకాయి. గతవారం రోజుల్లో ఈ స్టాక్ లోయర్ సర్క్యూట్ను తాకడం ఇది మూడోసారి
పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పార్ట్టైం నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదా నుంచి విజయ్ శేఖర్ శర్మ వైదొలిగిన విషయం తెలిసిందే. బ్యాంక్ బోర్డు పునర్నిర్మాణం పూర్తయిందని, కొత్త ఛైర్మన్ ప్రక్రియను త్వరలో ప్రకటిస్తామనీ సోమవారం ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో పీపీబీఎల్ పేర్కొంది.
పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారుల ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్లలో తాజా డిపాజిట్లను ఫిబ్రవరి 29 తరవాత అంగీకరించొద్దని రిజర్వ్ బ్యాంక్ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత గడువును మార్చి 15కు పొడిగించింది. ఈ నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో పేటీఎం షేర్ల పతనం కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
అప్పు చేసి ఇల్లు కొంటున్నారా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం తీసుకుంటాం. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్నవారూ.. ఇప్పటికే ఉన్నదాన్ని మార్చి, పెద్దది తీసుకోవాలనుకున్నా. -
ఫిక్స్డ్ డిపాజిట్ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
క్రెడిట్ కార్డు.. ఇలా తీసుకుందాం
క్రెడిట్ కార్డులు మన రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో ఒక భాగం అయ్యాయి. ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసమూ వీటిని ఉపయోగించుకునేందుకు వీలవుతోంది. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్