Flipkart: ఫ్లిప్కార్ట్లో టైగర్ గ్లోబల్ వాటాలు వాల్మార్ట్ చేతికి..!
ఫ్లిప్కార్ట్లో మరోసారి వాల్మార్ట్ భారీగా వాటాలను కొనుగోలు చేసింది. ఈ సారి టైగర్ గ్లోబల్ నుంచి వీటిని దక్కించుకొంది. ఈ డీల్ విలువ రూ.11 వేల కోట్ల పైమాటే.
ఇంటర్నెట్డెస్క్: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో కీలక వాటాలు అమెరికా సంస్థ వాల్మార్ట్ (Walmart) చేతికి వెళ్లాయి. ఈ మేరకు హెడ్జ్ఫండ్ సంస్థ టైగర్ గ్లోబల్స్(Tiger Global) ఇన్వెస్ట్మెంట్-వాల్మార్ట్ మధ్య డీల్ జరిగిందని వాల్స్ట్రీట్ జర్నల్ కథనం వెలువరించింది. ఈ డీల్ విలువ 1.4 బిలియన్ డాలర్లు (రూ.11.5 వేల కోట్లు)గా తెలుస్తోంది. టైగర్ గ్లోబల్స్ ఇన్వెస్ట్మెంట్స్ మదుపర్లకు రాసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ డీల్లో ఫ్లిప్కార్ట్ విలువను 35 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. 2021లో వాల్మార్ట్, ఇతర ఇన్వెస్టర్లు తమ వాటాలను సాఫ్ట్బ్యాంక్కు విక్రయించే సమయంలో ఫ్లిప్కార్ట్ విలువను 38 బిలియన్ డాలర్లుగా లెక్కించిన విషయం తెలసిందే.
2030కి తలసరి ఆదాయం రూ.3.28 లక్షలు!
2007లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఫ్లిప్కార్ట్ను ఆరంభించారు. 2009లో టైగర్ గ్లోబల్ తొలి సారి ఫ్లిప్కార్ట్లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి గతంలో టైగర్ గ్లోబల్లో ఎండీగా పనిచేశారు. 2010-2015 మధ్యలో టైగర్ గ్లోబల్ 1.2 బిలియన్ డాలర్లను ఈ ఆన్లైన్ వ్యాపార దిగ్గజంలో పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టబడిపై 3.5 బిలియన్ల లాభం సాధించినట్లు ఇన్వెస్టర్స్కు రాసిన లేఖలో వెల్లడించింది.
2018లో వాల్మార్ట్ 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లిప్కార్ట్లో 77 శాతం వాటా దక్కించుకొంది. మరో నాలుగేళ్లలో కంపెనీని ఐపీవోకు తీసుకెళతానని పేర్కొంది. ఇటీవల వాల్మార్ట్ ఇన్వెస్టర్స్ సదస్సులో కంపెనీ సీఎఫ్లో జాన్ డేవిడ్ రెయినీ మాట్లాడుతూ ఫ్లిప్కార్ట్కు 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరే సత్తాఉందని పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ మర్చంటైజ్ వాల్యూమ్లను 200 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో వాల్మార్ట్ అడుగులు వేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు