Flipkart: ఫ్లిప్కార్ట్లో టైగర్ గ్లోబల్ వాటాలు వాల్మార్ట్ చేతికి..!
ఫ్లిప్కార్ట్లో మరోసారి వాల్మార్ట్ భారీగా వాటాలను కొనుగోలు చేసింది. ఈ సారి టైగర్ గ్లోబల్ నుంచి వీటిని దక్కించుకొంది. ఈ డీల్ విలువ రూ.11 వేల కోట్ల పైమాటే.
ఇంటర్నెట్డెస్క్: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో కీలక వాటాలు అమెరికా సంస్థ వాల్మార్ట్ (Walmart) చేతికి వెళ్లాయి. ఈ మేరకు హెడ్జ్ఫండ్ సంస్థ టైగర్ గ్లోబల్స్(Tiger Global) ఇన్వెస్ట్మెంట్-వాల్మార్ట్ మధ్య డీల్ జరిగిందని వాల్స్ట్రీట్ జర్నల్ కథనం వెలువరించింది. ఈ డీల్ విలువ 1.4 బిలియన్ డాలర్లు (రూ.11.5 వేల కోట్లు)గా తెలుస్తోంది. టైగర్ గ్లోబల్స్ ఇన్వెస్ట్మెంట్స్ మదుపర్లకు రాసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ డీల్లో ఫ్లిప్కార్ట్ విలువను 35 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. 2021లో వాల్మార్ట్, ఇతర ఇన్వెస్టర్లు తమ వాటాలను సాఫ్ట్బ్యాంక్కు విక్రయించే సమయంలో ఫ్లిప్కార్ట్ విలువను 38 బిలియన్ డాలర్లుగా లెక్కించిన విషయం తెలసిందే.
2030కి తలసరి ఆదాయం రూ.3.28 లక్షలు!
2007లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ ఫ్లిప్కార్ట్ను ఆరంభించారు. 2009లో టైగర్ గ్లోబల్ తొలి సారి ఫ్లిప్కార్ట్లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి గతంలో టైగర్ గ్లోబల్లో ఎండీగా పనిచేశారు. 2010-2015 మధ్యలో టైగర్ గ్లోబల్ 1.2 బిలియన్ డాలర్లను ఈ ఆన్లైన్ వ్యాపార దిగ్గజంలో పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టబడిపై 3.5 బిలియన్ల లాభం సాధించినట్లు ఇన్వెస్టర్స్కు రాసిన లేఖలో వెల్లడించింది.
2018లో వాల్మార్ట్ 16 బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లిప్కార్ట్లో 77 శాతం వాటా దక్కించుకొంది. మరో నాలుగేళ్లలో కంపెనీని ఐపీవోకు తీసుకెళతానని పేర్కొంది. ఇటీవల వాల్మార్ట్ ఇన్వెస్టర్స్ సదస్సులో కంపెనీ సీఎఫ్లో జాన్ డేవిడ్ రెయినీ మాట్లాడుతూ ఫ్లిప్కార్ట్కు 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరే సత్తాఉందని పేర్కొన్నారు. మరోవైపు అంతర్జాతీయ మర్చంటైజ్ వాల్యూమ్లను 200 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో వాల్మార్ట్ అడుగులు వేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం