Vedantu: రెండేళ్లలో ఐపీఓకు వస్తాం
వేదాంతు సీఈఓ వంశీ కృష్ణ

ఈనాడు, హైదరాబాద్: ఇన్నాళ్లూ పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను ఆన్లైన్లో అందించిన తాము, వేదాంతు లెర్నింగ్ సెంటర్ పేరుతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యక్ష (ఆఫ్లైన్) తరగతులు నిర్వహించబోతున్నట్లు ఎడ్యుటెక్ అంకుర సంస్థ వేదాంతు సహ వ్యవస్థాపకుడు, సీఈఓ వంశీ కృష్ణ తెలిపారు. ఇందుకోసం విజ్ఞాన్తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంగళవారం ఇక్కడ వివరించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్లో 4, విజయవాడ, విశాఖపట్నంలలో ఒక్కోటి చొప్పున మొత్తం 6 కేంద్రాలను ప్రారంభించామని, వచ్చే ఏడాది వివిధ నగరాల్లో మరో 10 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 40 కేంద్రాలున్నాయని, వీటి సంఖ్య రెండేళ్లలో 200కు చేరుతుందన్నారు. 2021-22లో రెండు విడతల్లో 20 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చుకున్నామని, వీటినే విస్తరణ ప్రణాళికలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. సగటున 30% వృద్ధి సాధిస్తున్నామని, ఈ ఏడాది నుంచి లాభదాయకతపై దృష్టి పెట్టినట్లు వివరించారు. 2026-27 నాటికి తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చే ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. ఆఫ్లైన్ క్యాంపస్ల కోసం రూ.30-40 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

వార్షిక రిటర్నుల దాఖలు గడువు పెంపు
గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన కంపెనీల వార్షిక రిటర్నులు, ఆర్థిక నివేదికల సమర్పణ గడువును కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పొడిగించింది. -

అంబికా నుంచి రాగస్వర అగర్బత్తీ
అగర్బత్తీ పెట్టె తెరవగానే వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినిపించే ఉత్పత్తిని ‘రాగస్వర సుప్రభాతం’ పేరిట అంకుర సంస్థ అంబికా ఆరోగ్య విడుదల చేసింది. -

భా‘రథ’ చక్రాల పరుగులు
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పరుగులు తీస్తోంది. జపాన్ను సైతం వెనక్కి నెట్టి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. -

2025లో రూ.30 లక్షల కోట్లు
స్టాక్ మార్కెట్ మదుపర్ల సంపద విలువ ఈ ఏడాదిలో రూ.30 లక్షల కోట్ల మేర పెరిగింది. అయితే గత రెండేళ్లలో పెరిగిన సంపద విలువతో పోలిస్తే మాత్రం, 2025లో సగానికి పరిమితమైంది. -

ఏఐతో ఉత్పాదకతను పదింతలు చేస్తాం
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఛైర్మన్ ముకేశ్ అంబానీ ‘రిలయన్స్ ఏఐ ముసాయిదా మానిఫెస్టో’ను ఆవిష్కరించారు. -

హ్యుందాయ్ మోటార్ ‘ప్రైమ్ ట్యాక్సీ’ కార్లు
ట్యాక్సీలు, క్యాబ్ల వంటి వాణిజ్య అవసరాల కోసం ప్రత్యేక కార్లను ‘ప్రైమ్ ట్యాక్సీ’ శ్రేణిలో ఆవిష్కరించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. -

మన సంస్కరణలకు ప్రపంచం ఫిదా
కొత్త తరం సంస్కరణల ఫలితంగా, మన దేశం సాధిస్తున్న వృద్ధి తీరును ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు. -

రష్యా చమురు దిగుమతులు తగ్గాయ్
డిసెంబరులో రష్యా నుంచి మన దేశానికి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. -

2026-27లో సిమెంటు రంగ వృద్ధి 6-7%
భారత సిమెంటు పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6-7% వృద్ధిని నమోదు చేయగలదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. -

సంస్కరణల వల్ల తగ్గుతున్న సీఎన్జీ, పైప్లైన్ గ్యాస్ ధరలు
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (పీఎన్జీఆర్బీ) ఇటీవల చేపట్టిన సంస్కరణల వల్ల వినియోగదార్లకు ప్రయోజనాలు ప్రారంభమయ్యాయి. -

పబ్లిక్ ఇష్యూకు దీపా జువెలర్స్ సన్నాహాలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దీపా జువెలర్స్, తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) దాఖలు చేసింది. -

మళ్లీ పెరిగిన వెండి ధర
అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు చల్లబడే సూచనలతో సోమవారం భారీగా దిగొచ్చిన వెండి ధర, మంగళవారం మళ్లీ దూసుకెళ్లింది. -

సంక్షిప్త వార్తలు(7)
మారిటైమ్ ఫైనాన్సింగ్ రంగంలోకి అడుగు పెట్టినట్లు మంగళవారం సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. -

మళ్లీ పెరిగిన వెండి ధర.. కేజీ రూ.2.39 లక్షలకు
Gold-Silver Rates: బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. -

2025లో మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లు పైకి
Investors wealth: విదేశీ మదుపర్ల అమ్మకాలు, టారిఫ్ ఒత్తిడులు, రూపాయి పతనం వంటి ప్రతికూలతల నడుమ దలాల్ స్ట్రీట్ మదుపర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ఉత్తరాఖండ్లో రెండు లోకో రైళ్లు ఢీ.. పలువురికి గాయాలు
-

చైనా నాసిరకం ఉత్పత్తులే టార్గెట్.. స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్లు..!
-

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం.. పలువురికి గాయాలు
-

ఏపీలో రెండు కొత్త జిల్లాలకు ఉన్నతాధికారుల నియామకం
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/12/2025)
-

ఆకలితో వృద్ధుడి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె!


