Pakistan: 2030 నాటికి జీ20లో చేరడమే లక్ష్యం.. పాక్ కొత్త ప్రధాని షెహబాజ్
Pakistan: పాక్ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉందని కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. దీన్ని గాడిన పెట్టడమే తన లక్ష్యమన్నారు. 2030 నాటికి దేశాన్ని జీ20 కూటమిలో చేర్చడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను (Pakistan Economy) పూర్తిగా గాడిన పెడతామని కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఆ మేరకు వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామన్నారు. 2030 నాటికి జీ20 కూటమిలో చేరడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పీఎంఎల్-ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)ల తరఫున అభ్యర్థిగా ఉన్న షెహబాజ్.. జాతీయ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్లో మొత్తం 336 ఓట్లకుగానూ 201 ఓట్లు సాధించారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) మద్దతు ఉన్న అభ్యర్థి ఒమర్ అయూబ్ఖాన్కు 92 ఓట్లు మాత్రమే వచ్చాయి.
పాకిస్థాన్ (Pakistan) ముందు పెద్ద సవాల్తో పాటు అవకాశమూ ఉందని ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా ప్రసంగిస్తూ షెహబాజ్ షరీఫ్ అన్నారు. అయితే, కలిసికట్టుగా పోరాడితే సమస్యలను అధిగమిస్తామని చెప్పారు. అది కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం తీవ్ర రుణ సంక్షోభంలో ఉందని తెలిపారు. జాతీయ అసెంబ్లీ నిర్వహణ ఖర్చులను సైతం రుణాల ద్వారా సమీకరించుకున్న నిధులతోనే భరిస్తున్నామని వెల్లడించారు.
కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలను రద్దు చేస్తామంటూ షెహబాజ్ షరీఫ్ తన ప్రణాళికలను వివరించారు. సమగ్ర ఎగుమతి జోన్ల స్థాపనకు ప్రావిన్షియల్ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. పాక్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అత్యంత బలహీనంగా ఉందని తెలిపారు. దాదాపు రూ.లక్ష కోట్ల (పాకిస్థాన్ రూపాయల్లో) బడ్జెట్ లోటు ఉన్న సమయంలో తాను అధికారం చేపడుతున్నానని వెల్లడించారు. సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలో కూడా తెలియని స్థితిలో ఉన్నామన్నారు. రూ.వేల కోట్లు వడ్డీ రూపంలోనే కట్టాల్సి ఉందన్నారు. విద్యుదుత్పత్తి కంపెనీలకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించాలని తెలిపారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వంటి ప్రభుత్వ సంస్థలు రూ.వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయన్నారు.
ఇలాంటి పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కిస్తానని షెహబాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు. ఇది అంత సులభమైన పని కానప్పటికీ.. చేసి చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏటా దాదాపు రూ.500-600 కోట్ల విద్యుత్తు చోరీ జరుగుతోందని తెలిపారు. పన్ను ఎగవేత పెద్ద సమస్యగా ఉందన్నారు. ఈ లోపాలను సవరిస్తామని చెప్పారు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వ్యవసాయ రంగానికి దన్నుగా నిలుస్తామన్నారు. రాయితీలు కొనసాగిస్తామని తెలిపారు. రైతులకు సోలార్ ట్యూబ్వెల్ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. నకిలీ విత్తనాల మాఫియాను రూపుమాపుతామన్నారు. దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత