Weight Loss: రెండేళ్లలో 151 నుంచి 80 కిలోలకు.. కంపెనీ సీఈఓ ఇన్స్పైరింగ్ స్టోరీ
Dhruv Agarwala weight loss journey: ఏకంగా 80 కిలోలు తగ్గడమంటే కష్టమే కదా. కానీ, హౌసింగ్.కామ్ సీఈఓ దాన్ని నిజం చేసి చూపించారు. దానికోసం ఆయన ఏం చేశారో చూద్దాం..!
ఇంటర్నెట్ డెస్క్: బరువు తగ్గాలని ఎవరికి మాత్రం ఉండదు? ఆరోగ్యం, ఫిట్నెస్.. కారణమేదైనా చాలామంది ఇటీవల దీనిపై దృష్టి పెడుతున్నారు. ఆహారం, చేసే వ్యాయామాల విషయంలో కచ్చితమైన నియమాలు పాటిస్తున్నారు. కానీ, కొందరు ఫలితం వచ్చే వరకు కఠినమైన జీవనశైలిని అవలంబించలేక మధ్యలోనే నిష్క్రమిస్తుంటారు. అలాంటి వారికి ప్రముఖ స్థిరాస్తి సంస్థ హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ స్టోరీ స్ఫూర్తిమంతంగా నిలుస్తోంది. రెండేళ్లలో 71 కిలోలు తగ్గిన ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారు.
వ్యాపారరీత్యా సింగపూర్లో నివాసముంటున్న ధ్రువ్ అగర్వాల్ 2021లో ఓ పనిమీద భారత్కు వచ్చారు. ఆ సమయంలోనే ఆయనకు ఛాతీలో నొప్పిగా అనిపించింది. గుండెపోటు అనుకొని వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. ఇక చనిపోతాననే అనుకున్నారట. కానీ, అసిడిటీ వల్ల వచ్చిన సమస్య అని తెలుసుకొని ఊరట చెందారు. ఆ సంఘటనే తనని మేల్కొల్పిందని ఇటీవల ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో అప్పుడే తెలిసొచ్చిందంటూ తన వెయిట్ లాస్ జర్నీని (Dhruv Agarwala weight loss journey) పంచుకున్నారు.
- కోల్కతాలో పుట్టి పెరిగిన ధ్రువ్ ఆటల్లో చురుగ్గా ఉండేవారు. కెరీర్లో స్థిరపడే క్రమంలో అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల బరువు పెరిగారు. వారంలో మూడు స్ట్రెంత్ ట్రైనింగ్ సెషన్లతో బరువు తగ్గే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొంత కాలం తర్వాత వాకింగ్, హైకింగ్ ప్రారంభించారు. టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఫిట్నెస్ను స్ఫూర్తిగా తీసుకొని కృషి చేసినట్లు ధ్రువ్ వెల్లడించారు.
- ఈ క్రమంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. మోటివేషన్ కోల్పోయారు. బరువు తగ్గడం వల్ల ఉండే ప్రయోజనాలను తలచుకొని తిరిగి రీఛార్జ్ అయ్యేవారు. సవాల్గా స్వీకరించి ఆహార నియమాల్లో మార్పులు చేసుకున్నారు. ముందు పరిమాణాన్ని తగ్గించారు. తర్వాత క్రమంగా పౌష్టికాహారంపై దృష్టి సారించారు. రోజుకు 1,700 కెలోరీలకే పరిమితమయ్యారు. ప్రాసెస్డ్ ఫుడ్, వేపుళ్ల స్థానంలో అధిక ప్రోటీన్ ఉండే ఆహారం, చిరుతిళ్లను స్వీకరించారు. కార్బోహైడ్రేట్లను తగ్గించారు. దాదాపు 18నెలల పాటు ఆల్కహాల్కు పూర్తి దూరంగా ఉన్నారు.
- వ్యాయామం, ఆహార నియమాలతో పాటు ధ్రువ్ ఉక్కు సంకల్పం కూడా జతవ్వటంతో ఫలితాలొచ్చాయి. ఆ స్ఫూర్తితో మరింత ఫిట్నెస్ కోసం రన్నింగ్, స్విమ్మింగ్ మొదలుపెట్టారు. తన సతీమణి ఉపాసన సహకారంతో ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ అనుకున్న ఫలితాన్ని సాధించానని ధ్రువ్ వివరించారు.
- దీంతో 2021లో 151.7 కిలోలున్న ఆయన 2023 ఫిబ్రవరి నాటికి 80.6 కిలోలకు తగ్గారు. అధిక బరువుతో ఉన్నప్పుడు తనలో ప్రీడయాబెటిక్ లక్షణాలు ఉండేవని ధ్రువ్ తెలిపారు. అధిక కొలెస్ట్రాల్, బీపీ వల్ల దాదాపు నాలుగేళ్ల పాటు ఔషధాలు వాడినట్లు చెప్పారు. పైగా ‘స్లీప్ ఆప్నియా’తోనూ బాధపడినట్లు వెల్లడించారు. కానీ, ఇప్పుడు ఆ సమస్యలేవీ లేవని ధీమాగా చెప్పారు.
ఎవరీ ధ్రువ్ అగర్వాల్..
హౌసింగ్.కామ్, మకాన్.కామ్, ప్రాప్టైగర్.కామ్ వంటి డిజిటల్ స్థిరాస్తి వేదికలను నిర్వహిస్తున్న రియా ఇండియా సీఈఓ ధ్రువ్ అగర్వాల్. ఇల్లు కొనేవారికి భారత్లో ఈ సంస్థ సమగ్ర సేవలను అందిస్తోంది. టెక్ ఆధారిత స్థిరాస్తి వ్యాపారాల్లో తనదైన ముద్రవేసిన ధ్రువ్.. విద్య, మైనింగ్, ఫిన్టెక్ రంగంలోనూ పలు సంస్థలను ప్రారంభించారు. దేశంలో ఇళ్లు కొనే ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో 2011లో ప్రాప్టైగర్.కామ్ను స్థాపించారు. అనంతరం హౌసింగ్.కామ్, మకాన్.కామ్ను సొంతం చేసుకున్నారు.
అంతకు ముందు జనరల్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా బిజినెస్ ఇండియా సీఈఓగా ధ్రువ్ పనిచేశారు. ‘ఐట్రస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్’తో తన సొంత వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత దాన్ని కార్వీ కొనుగోలు చేసింది. నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి మెటీరియల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న ధ్రువ్.. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?