జుకర్బర్గ్, మస్క్ పనితీరు ఎలా ఉంటుందంటే.. వారితో పనిచేసిన అనుభవాలను పంచుకున్న భారత టెకీ
CEOs: గొప్ప సీఈఓలంతా చాలా చిన్న చిన్న విషయాలపైనే దృష్టి పెడతారని వారితో కలిసి పనిచేసిన ప్రముఖ టెక్ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో గొప్ప సీఈఓల్లో కొన్ని సాధారణ లక్షణాలుంటాయని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ టెక్ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్ (Indian Techie Sri Ram Krishnan) తెలిపారు. భారత సంతతికి చెందిన ఈయన మార్క్ జుకర్బర్గ్, సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్(Elon Musk) వంటివారితో కలిసి పనిచేశారు. వారితో ఉన్న అనుభవాలను ఆయన తాజాగా యూఏఈలో జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..
‘‘టీనేజర్గా ఉన్నప్పుడే కోడింగ్ రాయడం నేర్చుకున్నా. అదే టెక్ రంగంలోకి అడుగుపెట్టడానికి దోహదం చేసింది. 2007లో మైక్రోసాఫ్ట్లో చేరా. సియాటెల్లో కొన్ని సంవత్సరాల పాటు సత్య నాదెళ్లతో కలిసి పనిచేశా. అప్పటికీ ఆయన సీఈఓ కాలేదు. తర్వాత ఫేస్బుక్లో చేరి జుకర్బర్గ్తో పనిచేశాను. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఎలాన్ మస్క్తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ‘ఎక్స్’ (అప్పట్లో ట్విటర్) కొనుగోలు సమయంలో ఆయనతోనే ఉన్నాను. ప్రస్తుతం ఆండ్రెసెన్ హోరోవిట్జ్లో జనరల్ పార్ట్నర్గా ఉన్నాను’’ అని టైమ్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరామ్కృష్ణన్ వెల్లడించారు.
విజయవంతమైన అందరి సీఈఓల్లో కొన్ని సాధారణ లక్షణాలున్నాయని శ్రీరామ్కృష్ణన్ తెలిపారు. ‘‘జుకర్బర్గ్, మస్క్ వంటి సీఈఓలు కంపెనీలో చిన్నచిన్న విషయాలను సైతం వారే స్వయంగా చూసుకుంటారు. పర్యవేక్షణ బాధ్యతలను ఇతరులకు అప్పగించరు. నేను చూసిన గొప్ప సీఈఓలంతా మైక్రో మేనేజర్లు. జుకర్బర్గ్ ప్రతి అంశంపై శ్రద్ధ పెడతారు. ఒక ప్రాజెక్టుపై దానిమీద పనిచేస్తున్న యువ ఇంజినీర్ కంటే ఎక్కువ విషయాలు ఆయనకు తెలుసుంటాయి. కొన్నేళ్ల క్రితం వరకు నా జీవిత భాగస్వామి మెటాలోనే పని చేశారు. జుకర్బర్గ్ ఇప్పటికీ అలాగే ఉన్నారని ఆమె ఓ సందర్భంలో చెప్పారు’’ అని కృష్ణన్ గుర్తు చేసుకున్నారు.
అందరూ అనుకునేట్లుగా ఎలాన్ మస్క్ (Elon Musk) ఎక్కువ సమయాన్ని ‘ఎక్స్’లో పోస్ట్లు చేయడంపై వెచ్చించరని కృష్ణన్ తెలిపారు. ‘ఎక్స్’ను కొనుగోలు చేసిన సమయంలో 95 శాతం సమావేశాలు ఆయన జూనియర్ ఇంజినీర్లతోనే నిర్వహించారని చెప్పారు. అలాగే ఆయన ప్రతి విషయాన్ని చాలా లోతుగా చర్చించి ప్రణాళికలు వేస్తారని తెలిపారు.
భారత్ నుంచి అమెరికాకు మారిన తర్వాత ఆయన జీవితం ఎలా మారిందో కృష్ణన్ ఈసందర్భంగా వివరించారు. భారత్లో చాలా సంప్రదాయాలు, కట్టుబాట్ల మధ్య పెరిగానని తెలిపారు. తొలిసారి సిలికాన్ వ్యాలీకి వెళ్లినప్పుడు అక్కడి సంస్కృతి చాలా భిన్నంగా అనిపించినట్లు చెప్పారు. చెన్నైలో పుట్టి పెరిగిన ఆయన అన్నా యూనివర్సిటీకి చెందిన ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. 2005లో అమెరికాకు వెళ్లారు. అప్పటికీ ఆయన తండ్రి ఓ బీమా రంగంలో పనిచేస్తున్నారు. తల్లి గృహిణిగా ఉండేవారు. 2005లో మైక్రోసాఫ్ట్లో ఆయన టెక్ కెరీర్ ప్రారంభమైంది. అక్కడ ఆయన విండోస్ అజూర్ విభాగానికి ఎక్కువగా పనిచేశారు. ‘ఎక్స్’లో టైమ్లైన్, కొత్త యూఐ ప్లాట్ఫామ్, సెర్చ్ వంటి ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. ఫేస్బుక్, స్నాప్లో మొబైల్ యాడ్ ప్రోడక్ట్లనూ అభివృద్ధి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
ATM Scam: ఎప్పటికప్పుడు దుండగులు కొత్త రకం స్కామ్లకు తెరతీస్తున్నారు. తాజాగా ఏటీఎం మెషీన్లోని కార్డు రీడర్ను తొలగించి మోసాలకు పాల్పడుతున్నారు. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో 74,618 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతోంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
వసూళ్లలో జైఎస్టీ (జీఎస్టీ)
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. -
వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి నెల (ఏప్రిల్)లో టోకుగా 3.38 లక్షల ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు నమోదయ్యాయి. -
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ.5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ రూ.5,400 కోట్ల పెట్టుబడులు
జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎస్ఎల్) వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4.2 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు రూ.5,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఎండీ అభ్యుదయ్ జిందాల్ బుధవారం వెల్లడించారు. -
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 8 నుంచి 10 వరకు
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
బేబీ పౌడర్తో క్యాన్సర్ ఆరోపణలు!
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే)కు చెందిన అనుబంధ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ వల్ల అండాశయ క్యాన్సర్ రావొచ్చన్న ఆరోపణలను సెటిల్ చేసుకోవడానికి 25 ఏళ్లలో 6.48 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.54,000 కోట్లు) కట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. -
లీజుదార్ల చేతికి గోఫస్ట్ 54 విమానాలు
విమానయాన సంస్థ గోఫస్ట్కు అద్దె (లీజ్) పద్ధతిలో ఇచ్చిన 54 విమానాలను వెనక్కి తీసుకునేందుకు లీజుదార్లకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వాటిని డీరిజిస్టర్ చేసింది. -
అదానీ పవర్ లాభంలో 48% క్షీణత
వ్యయాలు పెరగడంతో ఆర్థిక ఫలితాల్లో అదానీ పవర్ రాణించలేకపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,737.24 కోట్లకు పరిమితమైంది. -
అదానీ విల్మర్ లాభంలో 67% వృద్ధి
ఫార్చ్యూన్ బ్రాండ్పై నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థ అదానీ విల్మర్.. జనవరి- మార్చిలో రూ.156.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
మన్పసంద్పై సెబీ ఆంక్షలు
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల గణాంకాల్లో అవకతవకలు వెలుగు చూడటం, వాటిని తప్పుగా వెల్లడించినందుకు గాను మన్పసంద్ బేవరేజెస్, ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. -
సంక్షిప్త వార్తలు(7)
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది. -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్పాండే సొంతిటిని కొనుగోలు చేయడం కంటే అద్దెంట్లో ఉండటమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!