Fixed Deposit: భారతీయులకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎందుకింత మక్కువ?
Fixed Deposit: భారత్లో అత్యధిక మంది ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు మొగ్గుచూపడానికి వెనుక ఉన్న కారణాలను తాజాగా ఓ సర్వే బయటపెట్టింది.
దిల్లీ: భారత్లో అనేక మదుపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లు, బీమా పథకాలు, బాండ్లు, పోస్టాఫీస్ పొదుపు పథకాలు ఇలా చాలా మార్గాల్లో డబ్బును మదుపు చేయొచ్చు. కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit- FD)కు ఉన్న ఆదరణ మాత్రం అంతాఇంతా కాదు. ఇప్పటికీ అత్యధిక మంది భారతీయులు దీన్నే తమ మదుపు మార్గంగా ఎంచుకుంటున్నారు. దీని వెనుక ఉన్న కారణాలను తాజాగా ఓ సర్వే బయటపెట్టింది.
ఇందుకే ఎఫ్డీల్లో...
ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) ఆదరణపై కువేరా అనే ‘ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్’ సంస్థ సర్వే నిర్వహించింది. దాదాపు 16 లక్షల మంది మదుపర్ల నుంచి ఇది అభిప్రాయాలను సేకరించింది. స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులు సహా ఇతర ఆర్థిక అనిశ్చితుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ల (Fixed Deposit)కు ఎలాంటి ముప్పు ఉండదని చాలా మంది తెలిపారు. దాదాపు 44 శాతం మంది ఈ కారణంగానే ఎఫ్డీ (Fixed Deposit)ని ఎంచుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు కావాల్సినప్పుడు సురక్షితంగా డబ్బును వాపస్ తీసుకోవడానికి ఎఫ్డీ కంటే మేలైన మార్గం లేదని మరికొంత మంది తెలిపారు. మరో 23 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కోసం తమ అత్యవసర నిధిని ఎఫ్డీల్లో పెడుతున్నట్లు వెల్లడించారు.
2017లోనూ ఎఫ్డీదే హవా..
2017లో సెబీ నిర్వహించిన సర్వేలోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. అప్పటికీ.. ఇప్పటికీ భారతీయ మదుపర్ల ఆలోచనల్లో పెద్దగా తేడా లేకపోవడం గమనించాల్సిన విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో సెబీ నిర్వహించిన సర్వేలో దాదాపు 95 శాతం మంది తమ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ల (Fixed Deposit)లో ఉంచడానికే మొగ్గుచూపారు. కేవలం 10 శాతం మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్లు, స్టాక్లను ఎంచుకున్నారు.
‘ఇది సరైన సమయం..’
‘‘ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ రెపోరేటును పెంచుతోంది. ఎఫ్డీ (Fixed Deposit)ల్లో మదుపు చేయడానికి ఇది సరైన సమయం. రాబోయే రోజుల్లో ఈ మార్గంలో పెట్టుబడులు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఎఫ్డీ (Fixed Deposit)లు సురక్షితమైనవే కాకుండా స్థిరమైన రాబడినిస్తాయి. ఈ కారణంగానే చాలా మంది భారతీయులు ఎఫ్డీలవైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా పెద్దగా నష్టభయాన్ని భరించలేని వారికి ఇది మంచి మార్గం’’ అని కువేరా సహ వ్యవస్థాపకుడు గౌరవ్ రస్తోగీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!