Elon musk: పరాగ్ను మస్క్ అందుకే తొలగించారా? ఇద్దరి మధ్య భేటీలో ఏం జరిగింది?
ఎలాన్ మస్క్ ట్విటర్ను స్వాధీనం చేసుకున్న వెంటనే సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వా్ల్ను తొలగించారు. దీని వెనుక కారణమేంటన్నది తాజాగా బయటకొచ్చింది.
\
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ కొనుగోలు అంశం ఇప్పుడంటే ముగిసిన అధ్యాయం. ట్విటర్ను ఎక్స్గా మార్చడం.. అందులో చేపడుతున్న ఎలాన్ మస్క్ (Elon musk) చేపడుతున్న మార్పులు గురించే ఇప్పుడు చర్చంతా. కానీ ముగిసిన అధ్యాయానికి సంబంధించి కొన్ని ఆసక్తి విషయాలు తాజాగా బయటకొచ్చాయి. ట్విటర్ను కొనుగోలు చేసిన వెంటనే అప్పట్లో ఆ సంస్థకు సీఈఓగా ఉన్న భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్కు (Parag Agrawal) ఎలాన్ మస్క్ ఉద్వాసన పలికారు. ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది తాజాగా బయటకొచ్చింది.
గతేడాది అక్టోబర్లో ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేశారు. సంస్థ తన అధీనంలోకి రాగానే పరాగ్ అగర్వాల్ను సీఈఓ పదవి నుంచి తప్పించారు. తనే ట్విటర్ సీఈఓగా ప్రకటించుకున్నారు. టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్లను, వేలాది ఉద్యోగులనూ ఎలాన్ మస్క్ తొలగించారు. అయితే, పరాగ్ను మస్క్ తొలగించడం వెనుక బలమైన కారణం ఉందట. ఎలాన్ మస్క్పై ఓ పుస్తకం రాసిన వాల్టర్ ఐజాక్సన్ అనే రచయిత ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. సెప్టెంబర్ 12న రాబోతున్న పుస్తకం గురించి వాల్స్ట్రీట్ జర్నల్లో పుస్తక సారాంశం రాస్తూ దీని గురించీ ప్రస్తావించారు.
సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ కడుతున్నారా?.. నెలాఖరులో ఇది పూర్తి చేయండి!
అది 2022 మార్చి. అప్పటికి ట్విటర్ కొనుగోలు గురించి తన ఆలోచనను ఎలాన్ బయటపెట్టని రోజులవి. సీఈఓ పరాగ్ అగర్వాల్, ఎలాన్ మస్క్ మధ్య భేటీ జరిగింది. రాత్రి డిన్నర్ సమయంలో వీరిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ భేటీ అనంతరం ఇద్దరూ పరస్పరం డిన్నర్ గురించి ట్వీట్లు కూడా చేసుకున్నారు. వాస్తవానికి ఈ భేటీ అనంతరం పరాగ్ గురించి మస్క్ మాట్లాడుతూ...‘పరాగ్ చాలా మంచి వ్యక్తి’ అని కొనియాడట కూడా. అదే సమయంలో తన అసహనాన్నీ వ్యక్తపరిచారట. ‘‘కంపెనీ నిర్వాహకులకు నచ్చినట్లు ఉంటే మాత్రం సరిపోదు. ట్విటర్ను ముందుకు నడిపించాలంటే దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పరాగ్ ఆ తరహా వ్యక్తికాదు’’ అని అన్నట్లు ఐజాక్సన్ పేర్కొన్నారు.
ఆ భేటీ జరిగిన కొద్ది రోజులకే ట్విటర్ గురించి మస్క్ ఓ ట్వీట్ చేశాడు. ‘ట్విటర్ చచ్చపోతోందా?’ అంటూ మస్క్ తన అసంతృప్తిని వ్యక్తంచేశాడు. దానిపై అగర్వాల్ స్పందిస్తూ.. ట్విటర్ను ఎలా మెరుగుపరచాలో తనకు సుద్దులు చెప్పొద్దు అనే అర్థం వచ్చేలా బదులిచ్చారు. దీంతో వారి మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. ఆ తర్వాత ట్విటర్ను కొనుగోలు చేస్తానని మస్క్ ముందుకు రావడం.. తర్వాత వెనుకడుగు వేయడం.. మళ్లీ కొనుగోలు చేయడం.. వస్తూ వస్తూనే పరాగ్ను తొలగించడం తర్వాతి కథ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
Aadhar Housing Finance IPO: రూ.3,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ రానుంది. ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
ఏప్రిల్లో మహీంద్రా వాహన అమ్మకాలు 70,471 యూనిట్లు
2024 ఏప్రిల్లో మహీంద్రా వాహన అమ్మకాలు 13 శాతం పెరిగి 70,471 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
Amazon- Flipkart: అమెజాన్, ఫ్లిప్కాట్ ఏటా వేసవిలో నిర్వహించే సేల్స్ మొదలయ్యాయి. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లపై ఓ లుక్కేయండి. -
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
Boult Soundbars: బౌల్ట్ హోమ్ ఆడియో డివైజ్ల రంగంలోకి ప్రవేశించింది. తాజాగా సౌండ్బార్లను ప్రవేశపెట్టింది. -
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 128, నిఫ్టీ 37 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
Vivo V30e: మొబైల్ తయారీ కంపెనీ 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్తో కొత్త మొబైల్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
WhatsApp: ఇకపై వాట్సప్లో ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎవరెవరు వస్తారో కూడా తెలుసుకోవచ్చు. వారికి నోటిఫికేషన్ ద్వారా గుర్తు చేయొచ్చు. అందుకు అనుగుణంగా కమ్యూనిటీలో ఈవెంట్స్ అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది వాట్సప్. -
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
ATM Scam: ఎప్పటికప్పుడు దుండగులు కొత్త రకం స్కామ్లకు తెరతీస్తున్నారు. తాజాగా ఏటీఎం మెషీన్లోని కార్డు రీడర్ను తొలగించి మోసాలకు పాల్పడుతున్నారు. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో 74,618 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతోంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
వసూళ్లలో జైఎస్టీ (జీఎస్టీ)
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. -
వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి నెల (ఏప్రిల్)లో టోకుగా 3.38 లక్షల ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు నమోదయ్యాయి. -
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ.5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ రూ.5,400 కోట్ల పెట్టుబడులు
జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎస్ఎల్) వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4.2 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు రూ.5,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఎండీ అభ్యుదయ్ జిందాల్ బుధవారం వెల్లడించారు. -
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 8 నుంచి 10 వరకు
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
బేబీ పౌడర్తో క్యాన్సర్ ఆరోపణలు!
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే)కు చెందిన అనుబంధ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ వల్ల అండాశయ క్యాన్సర్ రావొచ్చన్న ఆరోపణలను సెటిల్ చేసుకోవడానికి 25 ఏళ్లలో 6.48 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.54,000 కోట్లు) కట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. -
లీజుదార్ల చేతికి గోఫస్ట్ 54 విమానాలు
విమానయాన సంస్థ గోఫస్ట్కు అద్దె (లీజ్) పద్ధతిలో ఇచ్చిన 54 విమానాలను వెనక్కి తీసుకునేందుకు లీజుదార్లకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వాటిని డీరిజిస్టర్ చేసింది. -
అదానీ పవర్ లాభంలో 48% క్షీణత
వ్యయాలు పెరగడంతో ఆర్థిక ఫలితాల్లో అదానీ పవర్ రాణించలేకపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,737.24 కోట్లకు పరిమితమైంది. -
అదానీ విల్మర్ లాభంలో 67% వృద్ధి
ఫార్చ్యూన్ బ్రాండ్పై నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థ అదానీ విల్మర్.. జనవరి- మార్చిలో రూ.156.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
మన్పసంద్పై సెబీ ఆంక్షలు
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల గణాంకాల్లో అవకతవకలు వెలుగు చూడటం, వాటిని తప్పుగా వెల్లడించినందుకు గాను మన్పసంద్ బేవరేజెస్, ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. -
సంక్షిప్త వార్తలు(7)
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్