Ratan Tata: తాజ్ మహల్ హోటల్కు అసలైన అందం అదే.. రతన్ టాటాకు హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు..!
రతన్ టాటా గొప్ప వ్యాపారే కాదు.. అంతకు మించిన జంతుప్రేమికుడు. ఆయన చర్యలు ఎన్నోసార్లు దేశ ప్రజల హృదయాలను గెలుచుకొన్నాయి. తాజాగా అలాంటి విషయమే మరొకటి వెలుగులోకి వచ్చింది.. అదేంటంటే..
ఇంటర్నెట్డెస్క్: ‘తాజ్ మహల్ హోటల్’ ఈ పేరు వింటే గుర్తుకొచ్చేది సంపదే.. దేశంలోనే పేరున్న వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సంపన్నులు ముంబయిలో సేదదీరడానికి వచ్చే ప్రదేశం. అడుగడుగునా రాజరికం ఉట్టిపడుతుంటుంది. ఇందులో ఓ మానవీయ కోణం కూడా ఉంది. రతన్ టాటా (Ratan Tata) మూగజీవాలపై చూపే ప్రేమకు ఈ హోటల్ ఓ నిదర్శనంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ హెచ్ఆర్ నిపుణురాలు రుబీ ఖాన్ తన లింక్డిన్ పోస్టులో వెల్లడించారు.
తాను ఆ హోటల్కు వెళ్లినప్పుడు ఓ వీధి శునకం ప్రవేశద్వారం పక్కనే నిద్రపోవడాన్ని గమనించినట్లు రూబీ పేర్కొన్నారు. చాలా విలాసవంతమైన ఆ ప్రదేశంలో అది ఎందుకు ఉందా అనే సందేహం రావడంతో.. అక్కడే ఉన్న సిబ్బందిని దాని గురించి ప్రశ్నించినట్లు వెల్లడించారు. వారు చెప్పిన సమాధానం విని రతన్టాటాపై గౌరవం మరింత పెరిగినట్లు పేర్కొన్నారు. ‘‘ఆ శునకం పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగింది. హోటల్లో ఓ భాగమైపోయింది. అక్కడికి వచ్చే ఏ మూగజీవాన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్టాటా నుంచి విస్పష్టమైన ఆదేశాలున్నాయి’’ అని సిబ్బంది వెల్లడించినట్లు రాసుకొచ్చారు.
నిత్యం వీఐపీలు వచ్చే ప్రతిష్ఠాత్మక సంస్థ వద్ద ఆ శునకం ప్రశాంతంగా నిద్రపోవడం తన మనసును తాకిందని రూబీ పేర్కొన్నారు. చాలా మంది అతిథులు అసలు దానిని గమనించి ఉండరన్నారు. ఇంత గందరగోళం మధ్య కూడా ఆ ప్రదేశాన్ని అది సొంతదిగా భావించిందని ముచ్చటపడ్డారు. మనం తరచూ చెప్పే కలుపుగోలుతనం, సైకలాజికల్ సేఫ్టీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటివి ఇక్కడ కార్యాచరణలో కనిపించాయన్నారు. ఈ పోస్టు లింక్డిన్లో వైరల్గా మారింది. చాలా మంది యూజర్లు రతన్టాటా మానవత్వానికి ఫిదా అయ్యారు.
రతన్ టాటా మూగజీవాలపై ప్రేమను ఎప్పుడూ దాచుకోలేదు. ఆయన తన వ్యాపార సామ్రాజ్య ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్లో వీధి శునకాలకు ఏకంగా ప్రత్యేక గదినే కేటాయించారు. అవి ఆడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. గతేడాది వర్షాకాలం ప్రారంభంలో రతన్ టాటా తన ఇన్స్టా ఖాతాలో వాహనదారులకు ఓ అభ్యర్థన చేశారు. ‘వానాకాలం వచ్చేసింది. ఈ సమయంలో మన కార్ల కింద పిల్లులు, వీధి కుక్కలు తలదాచుకుంటుంటాయి. కారును ముందుకు పోనిచ్చేటప్పుడు దాని కింద ఒకసారి తనిఖీ చేసుకోండి. లేకపోతే అవి తీవ్రంగా గాయపడటమో, అవయవాలను కోల్పోవడమో, చనిపోవడమో జరుగుతుంది. ఈ వర్షాకాలంలో మీరు మూగజీవాల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తే.. ఉపయోగకరంగా ఉంటుంది’ అని పోస్టు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?