Artificial intelligence: ఏఐ నైపుణ్యాలుంటే.. భలే జీతం!
కృత్రిమ మేధ నైపుణ్యాలను కలిగిన ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగే అవకాశముందని అమెజాన్ అనుబంధ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) నిర్వహించిన పరిశోధనలో తేలింది.
దిల్లీ: కృత్రిమమేధ (Artificial intelligence) నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు (Employees) భారీ జీతాలు అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. భారత్లో ఏఐ స్కిల్స్ ఉన్నవారికి 54 శాతం కంటే ఎక్కువ జీతం పెరిగే వీలుందని ఉందని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఐటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్లలో పని చేసేవారికి మరింత మేలు చేకూరుతుందని పేర్కొంది. 2028 నాటికి దేశంలోని 99 శాతం మంది యజమానులు తమ కంపెనీలను ఏఐ ఆధారిత సంస్థలుగా మార్చే అవకాశం ఉందని ఏడబ్ల్యూఎస్ తన నివేదికలో పేర్కొంది. తద్వారా సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చని వారు భావిస్తున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఐటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ, మానవ వనరుల విభాగాల్లో ఏఐ సేవలు వినియోగించుకునేందుకు యజమానులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. రాబోయే ఐదేళ్లలో 98శాతం మంది యజమానులు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఏడబ్ల్యూఎస్ తేల్చింది.
పరిశోధనలో భాగంగా అమెజాన్ అనుబంధ సంస్థ అయిన ఏడబ్ల్యూఎస్ 1,600 మంది కార్మికులు, 500 సంస్థల యజమానులపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. ఏఐ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులనే నియమించుకునేందుకు సంస్థలు మొగ్గు చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే, 79 శాతం మంది యజమానులకు అది సాధ్యపడటం లేదని, దీనికి ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యావేత్తల సహకారం అవసరమని తెలిపింది. భారత్లో కృత్రిమ మేధను మరింత అభివృద్ధి చేసి క్షేత్ర స్థాయిలో వినియోగించుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న ఏడబ్ల్యూఎస్.. ఏఐ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు 95 శాతం మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు విప్రో, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, ఐరిస్ సాఫ్ట్వేర్ తదితర సంస్థల ఉద్యోగులకు ఆయా రంగాల్లో ఏఐ ఆధారిత శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు తాము సహకరిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్- ఇండియా అధిపతి అమిత్ మెహతా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి