Artificial intelligence: ఏఐ నైపుణ్యాలుంటే.. భలే జీతం!
కృత్రిమ మేధ నైపుణ్యాలను కలిగిన ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగే అవకాశముందని అమెజాన్ అనుబంధ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) నిర్వహించిన పరిశోధనలో తేలింది.
దిల్లీ: కృత్రిమమేధ (Artificial intelligence) నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు (Employees) భారీ జీతాలు అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. భారత్లో ఏఐ స్కిల్స్ ఉన్నవారికి 54 శాతం కంటే ఎక్కువ జీతం పెరిగే వీలుందని ఉందని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఐటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్లలో పని చేసేవారికి మరింత మేలు చేకూరుతుందని పేర్కొంది. 2028 నాటికి దేశంలోని 99 శాతం మంది యజమానులు తమ కంపెనీలను ఏఐ ఆధారిత సంస్థలుగా మార్చే అవకాశం ఉందని ఏడబ్ల్యూఎస్ తన నివేదికలో పేర్కొంది. తద్వారా సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చని వారు భావిస్తున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఐటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ, మానవ వనరుల విభాగాల్లో ఏఐ సేవలు వినియోగించుకునేందుకు యజమానులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. రాబోయే ఐదేళ్లలో 98శాతం మంది యజమానులు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఏడబ్ల్యూఎస్ తేల్చింది.
పరిశోధనలో భాగంగా అమెజాన్ అనుబంధ సంస్థ అయిన ఏడబ్ల్యూఎస్ 1,600 మంది కార్మికులు, 500 సంస్థల యజమానులపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. ఏఐ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులనే నియమించుకునేందుకు సంస్థలు మొగ్గు చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే, 79 శాతం మంది యజమానులకు అది సాధ్యపడటం లేదని, దీనికి ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యావేత్తల సహకారం అవసరమని తెలిపింది. భారత్లో కృత్రిమ మేధను మరింత అభివృద్ధి చేసి క్షేత్ర స్థాయిలో వినియోగించుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న ఏడబ్ల్యూఎస్.. ఏఐ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు 95 శాతం మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు విప్రో, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, ఐరిస్ సాఫ్ట్వేర్ తదితర సంస్థల ఉద్యోగులకు ఆయా రంగాల్లో ఏఐ ఆధారిత శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు తాము సహకరిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్- ఇండియా అధిపతి అమిత్ మెహతా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి