Best Airports: ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
Best Airports: స్కైట్రాక్స్ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిలో తొలి 20 స్థానాల్లో ఏవి నిలిచాయి? భారత్లోని ఎయిర్పోర్టుల పరిస్థితి ఏంటో చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుగా (Worlds Best Airport 2024) నిలిచింది. సింగపూర్కు చెందిన ఛాంగి రెండో స్థానంలో ఉంది. కొన్నేళ్లుగా ఈ జాబితాలో తొలి రెండు స్థానాలను ఈ రెండే పంచుకుంటుండడం విశేషం. స్కైట్రాక్స్ ఏటా విడుదల చేసే ఈ నివేదికలో గతేడాది ఛాంగి అగ్రభాగాన నిలిచింది.
సియోల్ ఇన్చెయాన్ విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. 2024లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్టుగానూ ఇది అవార్డు సొంతం చేసుకుంది. టోక్యోలోని హనీదా, నరీతా వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. కొవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం అందుకు దోహదం చేసింది.
అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయం కూడా తొలి 20 స్థానాల్లో లేకపోవడం గమనార్హం. సియాటెల్లోని టకోమా ఎయిర్పోర్టుకు దక్కిన 24వ ర్యాంకే ఆ దేశానికి అత్యుత్తమైనది. ఐరోపా ప్రాంతంలో ప్యారిస్ చార్లెస్ డి గలే, మ్యూనిచ్, జ్యూరిక్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
భారత విమానాశ్రయాలు ఇలా..
ఈ జాబితాలో తొలి 100 ఎయిర్పోర్టుల్లో భారత్కు చెందినవి నాలుగు మాత్రమే ఉన్నాయి. దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో నిలిచింది. బెంగళూరు ఎయిర్పోర్టు స్థానం 69 నుంచి 59కి మెరుగైంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్థానం 65 నుంచి 61కి ఎగబాకింది. ముంబయి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మాత్రం 84 నుంచి 95వ స్థానానికి పడిపోయింది.
దిల్లీ విమానాశ్రయం దక్షిణాసియాలో బెస్ట్ ఎయిర్పోర్టుగా నిలిచింది. సిబ్బంది సేవల్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు దక్షిణాసియాలోనే అగ్రస్థానం దక్కించుకుంది. అలాగే దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్పోర్టుగా బెంగళూరు నిలిచింది.
- న్యూయార్క్లోని జెఎఫ్కే విమానాశ్రయం ఐదు స్థానాలు కోల్పోయి 93లో నిలిచింది. లాగార్డియా 57 నుంచి 33కు ఎగబాకింది.
- ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ ఎయిర్పోర్టు తొలిస్థానంలో నిలిచింది. జాబితాలో 19వ స్థానాన్ని నిలబెట్టుకుంది.
- లండన్ హీత్రో విమానాశ్రయం ఒక స్థానం మెరుగుపడి 21కి చేరింది. గాట్విక్ ఏడు స్థానాలు ఎగబాకి 48లో నిలిచింది.
- జపాన్కు చెందిన ఒకినావా ఎయిర్పోర్టు ఏకంగా 199 నుంచి 91వ స్థానానికి చేరడం విశేషం.
ప్రపంచంలో తొలి 20 అత్యుత్తమ విమానాశ్రయాలు ఇవే..
1.హమద్ (దోహా) 2.ఛాంగి (సింగపూర్) 3.ఇన్చెయాన్ (సియోల్) 4.హనీదా (టోక్యో) 5.నరీతా (టోక్యో) 6.చార్లెస్ డి గలే (పారిస్) 7.దుబాయ్ (యూఏఈ) 8.మ్యూనిచ్ (జర్మనీ) 9.జ్యూరిక్ (స్విట్జర్లాండ్) 10.ఇస్తాంబుల్ (తుర్కియే) 11.హాంకాంగ్ 12.ఫ్యూమిసినో (రోమ్) 13.వియన్నా (ఆస్ట్రియా) 14.వాంటా (హెల్సింకీ) 15.బరజాస్ (మ్యాడ్రిడ్) 16.సెంట్రైర్ నగోయా (జపాన్) 17.వాంకోవర్ (కెనడా) 18.కాన్సాయ్ (జపాన్) 19. మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) 20.కోపెన్ హెగెన్ (డెన్మార్క్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం