X Value: ‘ఎక్స్’ విలువ 19 బి.డాలర్లే.. మస్క్ చెల్లించిన దానిలో సగం కంటే తక్కువ!
X Value: ‘ఎక్స్’ను ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దాని విలువ ఇప్పుడు కేవలం 19 బి.డాలర్లే ఉంటుందని స్వయంగా కంపెనీయే లెక్క గట్టింది.
X Value | వాషింగ్టన్: సామాజిక మాధ్యమ దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) (Social Media X) సోమవారం తమ ఉద్యోగులకు స్టాక్ గ్రాంట్స్ను జారీ చేసింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా జారీ చేసిన స్టాక్ గ్రాంట్స్ ప్రకారం కంపెనీ విలువ (X Value) కేవలం 19 బిలియన్ డాలర్లు మాత్రమే. బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) దీన్ని గత ఏడాది 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంటే ఎక్స్ విలువ (X Value) దాదాపు సగానికి పైగా పడిపోయిందన్నమాట!
ఎలాన్ మస్క్ (Elon Musk) ఒక్కో ట్విటర్ స్టాక్కు 54.20 డాలర్ల చొప్పున చెల్లించారు. తాను కంపెనీకి దాని విలువ కంటే అధికంగా చెల్లించానని ఆయన మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. మార్చిలో కంపెనీ ఉద్యోగులకు లేఖ రాస్తూ ఎక్స్ విలువ 20 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ధ్రువీకరించినట్లయింది. స్టాక్ గ్రాంట్స్ విలువను కంపెనీ బోర్డు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తుంది. ఈ లెక్కన ఒక్కో షేరు విలువను 45 డాలర్లుగా లెక్కగట్టి ఉద్యోగులకు గ్రాంట్స్ జారీ చేసింది. అంటే తమ కంపెనీ విలువ 19 బిలియన్ డాలర్లే అని స్వయంగా వారే అంగీకరించినట్లయింది.
‘రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (RSU)’ కింద ఒక్కో షేరును 45 డాలర్ల విలువతో జారీ చేస్తున్నామని ఎక్స్ తమ ఉద్యోగులకు తెలిపింది. రానున్న రోజుల్లో వీటిని విక్రయించి సొమ్ము చేసుకునే వెసులుబాటు ఉద్యోగులకు ఉంటుంది. అయితే, పాత యాజమాన్యం ఆధ్వర్యంలో పొందిన షేర్లకు మాత్రం కొనుగోలు సమయంలో నిర్ణయించినట్లుగా ఒక్కో స్టాక్పై 54.20 డాలర్లు చెల్లిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, కంపెనీ విలువ సగానికి పడిపోయినప్పటికీ.. షేరు విలువలో కూడా ఆ స్థాయి తగ్గుదల ఎందుకు నమోదు కాలేదనే విషయంపై స్పష్టత లేదు.
ట్విటర్ను సొంతం చేసుకున్న వెంటనే కంపెనీలో మస్క్ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దాదాపు 80 శాతం ఉద్యోగులను తొలగించేశారు. వెరిఫికేషన్ ప్రక్రియను మార్చారు. కంటెంట్ మాడరేషన్లోనూ మార్పులు తీసుకొచ్చారు. పేరును ట్విటర్ నుంచి ‘ఎక్స్’గా మార్చారు. మరోవైపు విద్వేషపూరిత సమాచారం పెరిగిపోయిందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఫలితంగా వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 60 శాతం తగ్గిందని గత వేసవిలో మస్క్ స్వయంగా అంగీకరించారు. అయితే, రానున్న రోజుల్లో ‘ఎక్స్’ను ఒక పూర్తి స్థాయి ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చనున్నట్లు ఇటీవల ఉద్యోగులను ఉద్దేశించి ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ను తీసుకొచ్చినట్లు తెలిపారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఎక్స్ను ఒక వ్యక్తి ఆర్థిక జీవితానికి అడ్డాగా మార్చి అసలు బ్యాంకు ఖాతా అవసరమే లేకుండా చేస్తామని పేర్కొన్నారు. 2024 చివరకు చాలా మార్పులు రాబోతున్నాయని పరోక్షంగా ఉద్యోగులకు తదుపరి లక్ష్యాలను నిర్దేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం