Year Ender 2023: పసిడి మెరుపులు.. భారీ GST వసూళ్లు.. రికార్డు యూపీఐ లావాదేవీలు..!
గత రెండు సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తోంది. ఈ క్రమంలో 2023లో పలు కీలక పరిణామాలను చవిచూసింది.
Year Ender 2023 | ఇంటర్నెట్ డెస్క్: గత రెండు సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తోంది. ఈ క్రమంలో 2023లో పలు కీలక పరిణామాలను చవిచూసింది. పెరిగిన స్థిరత్వం, మరింత ఆశావాదంతో బలమైన వృద్ధి, భవిష్యత్ అవకాశాలను ఒడిసి పట్టేందుకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక ఆర్థిక అంశాల్లో భారత్ పనితీరు ఎలా ఉందో చూద్దాం..!
ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా..
3.75 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తలసరి ఆదాయం రూ.98,374గా ఉంది. 2027 నాటికి మన దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ డి పాత్రా ఇటీవల అంచనా వేశారు.
ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి..
సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జులై-సెప్టెంబరులో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.2 శాతంగా నమోదైంది. 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలోనూ హవా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ ఇటీవల అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 6.5 శాతం వృద్ధిని సౌకర్యవంతంగా నమోదు చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 16 శాతానికి పైనే ఉంటుందని ఇటీవల ఐఎంఎఫ్ తెలిపింది.
నెమ్మదించిన ఎఫ్డీఐలు..
భారత్లోకి 2023లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం నెమ్మదించింది. జనవరి- సెప్టెంబర్ మధ్య ఎఫ్డీఐలు 22 శాతం తగ్గి 48.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2014-23 మధ్య మొత్తం 596 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలను భారత్ ఆకర్షించినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాల నేపథ్యంలో 2024లో భారీ ఎత్తున ఎఫ్డీఐలు వస్తాయని అంచనా వేసింది.
పన్ను వసూళ్లు ఇలా..
2023-24లో అక్టోబరు వరకు ప్రభుత్వ పన్ను ఆదాయం రూ.13.01 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.2.65 లక్షల కోట్లుగా నమోదైంది. మరోవైపు అక్టోబర్ 31 నాటికి 7.85 కోట్ల ఆదాయ పన్ను రిటర్నులు దాఖలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇటీవల వెల్లడించింది. క్రితం ఏడాదితో పోలిస్తే 11.7 శాతం వృద్ధి నమోదైంది.
UPI లావాదేవీల్లో 50% పెరుగుదల..
ఈ ఏడాది నవంబర్లో యూపీఐ చెల్లింపులు రూ.17.40 లక్షల కోట్లతో రికార్డు స్థాయికి చేరాయి. వార్షిక ప్రాతిపదికన ఆ నెలలో 46 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. మొత్తంగా 2023- 24లో ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీల విలువలో సగటున 40 శాతం వృద్ధి నమోదైంది. సంఖ్యాపరంగా చూస్తే 50 శాతం పెరిగాయి. 2022-23లో 8,376 కోట్ల లావాదేవీల్లో రూ.139 లక్షల కోట్ల విలువ చేసే యూపీఐ చెల్లింపులు జరిగాయి.
13 కోట్ల 5జీ సబ్స్క్రైబర్లు..
భారత్లో 2022 అక్టోబర్లో ప్రారంభమైన 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరించింది. తొలి 14 నెలల్లో 13 కోట్ల మంది యూజర్లు 5జీకి మారారు. దేశీయ టెలికాం సంస్థలు ఇప్పటి వరకు నాలుగు లక్షల టవర్లను 5జీతో అనుసంధానం చేశాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
50 శాతం పెరిగిన ఈవీ విక్రయాలు..
వాహన్ డేటాబేస్ ప్రకారం ఇప్పటి వరకు భారత్లో 34.54 లక్షల విద్యుత్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2023 తొలి 11 నెలల్లో 13.87 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 50 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం వాహనాల్లో ఈవీల వాటా మాత్రం ఇంకా 2.4 శాతం వద్దే ఉండడం గమనార్హం.
బంగారం మెరుపులు..
ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2023 ఆరంభమయ్యే నాటికి 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు) ధర రూ.55,040గా ఉండేది. డిసెంబర్ 26 నాటికి అది రూ.63,710కి చేరింది. మొత్తంగా పది గ్రాముల బంగారం ధర ఈ ఒక్క ఏడాదిలోనే రూ.8,670 (15.75%) మేర పెరిగింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి కనబర్చారు.
రికార్డు జీఎస్టీ వసూళ్లు..
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలోనూ ఈ ఏడాది రికార్డులు నమోదయ్యాయి. నవంబరులో రూ.1.68 లక్షల కోట్లు వసూళ్లు వచ్చాయి. 2022 నవంబరుతో పోలిస్తే ఇవి 15 శాతం అధికం. ఈ ఏడాది ప్రతినెలా సగటున రూ.1.66 లక్షల కోట్ల వసూళ్లు నమోదైనట్లు ఇటీవల కేంద్రం లోక్సభలో వెల్లడించింది. ఏప్రిల్లో జీఎస్టీ నుంచి రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్