Kotak Gen Insurance: కోటక్ జనరల్ ఇన్సూరెన్స్లో జూరిచ్ ఇన్సూరెన్స్కు 51% వాటా
Kotak Gen Insurance: కంపెనీ విస్తరణ కోసం కొత్తగా మూలధనాన్ని అందించడంతో పాటు షేర్ల కొనుగోలు రూపంలో జూరిచ్ ఇన్సూరెన్స్ ఈ కొనుగోలును పూర్తి చేయనున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది.
ముంబయి: తమ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్లో స్విట్జర్లాండ్కు చెందిన జూరిచ్ ఇన్సూరెన్స్ 51 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు మాతృసంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. ఈ కొనుగోలు ఒప్పంద విలువ రూ.4,051 కోట్లుగా తెలిపింది. కంపెనీ విస్తరణ కోసం కొత్తగా మూలధనాన్ని అందించడంతో పాటు షేర్ల కొనుగోలు రూపంలో జూరిచ్ ఇన్సూరెన్స్ ఈ కొనుగోలును పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. రాబోయే మూడేళ్లలో మరో 19 శాతం వాటాను కూడా కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది.
నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ మార్కెట్ వాటా సెప్టెంబర్ నాటికి ప్రీమియంల పరంగా 0.52 శాతం. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల ప్రీమియం వసూళ్లు రూ.1,148 కోట్లుగా నమోదైంది. షేర్ల విక్రయాల పరంగా చూస్తే కంపెనీ విలువ రూ.7,913 కోట్లని అంచనా. ఇరు కంపెనీల మధ్య కుదిరిన తాజా కొనుగోలు ఒప్పందానికి ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, సీసీఐల నుంచి అనుమతి లభించాల్సి ఉంది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కోటక్ జనరల్ నష్టాలు వార్షిక ప్రాతిపదికన రూ.17 కోట్ల నుంచి రూ.7 కోట్లకు తగ్గాయి.
భారత బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు లభించినప్పటి నుంచి విదేశీ కంపెనీలు దేశీయ ఇన్సూరెన్స్ కంపెనీల్లో తమ వాటాలను క్రమంగా పెంచుకుంటుండటం గమనార్హం. జూరిచ్ ఇన్సూరెన్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్