Khammam: క్యాన్సర్‌ నిర్ధారణ.. తోటలో కుమార్తెతో సహా దంపతుల ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు.. కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Updated : 23 Jun 2023 12:53 IST

పెనుబల్లి: అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు.. కుమార్తెతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకారాయగూడేనికి చెందిన పోట్రు కృష్ణయ్య (40), సుహాసిని (35)లకు అమృత (19) అనే కుమార్తె ఉంది. సుహాసినికి నెలన్నర క్రితం కృష్ణా జిల్లా తిరువూరులో గర్భసంచికి శస్త్రచికిత్స చేశారు. అప్పుడు నమూనాలను పంపగా గురువారం క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. తిరువూరు వైద్యులను సంప్రదించగా కీమో థెరపీకి హైదరాబాద్‌ వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 

తిరువూరు నుంచి స్వగ్రామానికి వచ్చేటపుడు 3 స్టూళ్లు, తాడు కొనుగోలు చేసుకుని వచ్చారు. అనంతరం కొత్తకారాయిగూడెంలోని తమ మామిడితోటకు వారు చేరుకున్నారు. గురువారం రాత్రి అక్కడే మామిడిచెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి సీఐ హనూక్‌, ఎస్సై సూరజ్‌ చేరుకుని పరిశీలించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని