cybercrime: ఐటీ ఉద్యోగికి సైబర్‌ మోసగాళ్ల వల.. రూ.3.5 కోట్లకు టోకరా!

cybercrime: ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి సైబర్‌ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ.3.5 కోట్లు పోగొట్టుకున్నాడు.

Updated : 30 Nov 2023 21:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్‌ మోసాలపై అవగాహన కల్పిస్తున్నా తరచూ వాటి వలలో ఎవరో ఒకరు చిక్కుకుపోతూనే ఉన్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ కేటుగాళ్లు మాత్రం మాయ మాటలతో బోల్తా కొట్టించి పెద్ద ఎత్తున డబ్బులు ఎగరేసుకుపోతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని పోలీసు అధికారులమంటూ నమ్మించి రూ.3.5 కోట్ల డబ్బును దోచుకున్నారు. అసలేం జరిగిందంటే..?

బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి గుర్తు తెలీని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. ‘ట్రాయ్‌ నుంచి కాల్‌ చేస్తున్నాం. ముంబయిలోని  పోలీస్ స్టేషన్‌లో మీపై క్రిమినల్‌ కేసు, ఆధార్‌ కార్డు వివరాలతో మనీ లాండరింగ్‌ కేసు నమోదైంది. విచారణ కోసం ముంబయికి రావాల్సి ఉంటుంది’ అని సైబర్‌ మోసగాళ్లు ఫోన్‌ చేశారు. మరో నంబర్‌ నుంచి వీడియో కాల్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేయగానే ఖాకీ దుస్తులు, ఫేక్‌ ఐడీ కార్డుల్ని, కంప్లెయింట్‌ కాపీని చూపించి ఆ వ్యక్తిపై బెదిరింపులకు దిగారు.

2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కుంగుబాటు.. ఓఈసీడీ అంచనా!

అరెస్టు చేయకుండా కేసును పరిష్కరించాలంటే వారి బ్యాంకు ఖాతాలకు డబ్బుల్ని బదిలీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు చెప్పినట్లుగానే బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేశారు. కేవలం 48 గంటల్లోనే ఏకంగా రూ.3.7 కోట్ల డబ్బుల్ని వారు చెప్పిన అన్ని ఖాతాలకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. తిరిగి కాల్‌ చేస్తే స్పందన లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వ్యక్తి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాడు. అయితే రూ.3 కోట్ల కంటే ఎక్కువ డబ్బులకు సంబంధించిన అంశం కావటంతో పోలీసులు ఈ కేసును సీఐడీకి అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని