ORR-Hyderabad: డివైడర్ పైనుంచి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ORR)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
శామీర్పేట్: హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ORR)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శామీర్పేట - కీసర మధ్యలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డులో ఘట్కేసర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి డివైడర్ పైనుంచి దూసుకొచ్చి.. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం, కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సహా బొలెరో వాహనంలోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!