Mumbai: హోటల్లో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి
ముంబయిలోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
ముంబయి: మహారాష్ట్ర రాజధాని నగరం ముంబయి(Mumbai)లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. హోటల్ గెలాక్సీలో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. శాంతాక్రూజ్ ప్రాంతంలోని ప్రభాత్నగర్ కాలనీలో ఉన్న ఈ హోటల్ రెండో అంతస్తులో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!