నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
కావేరి నదిలో ఈతకు దిగిన విద్యార్థులు ఐదుగురు మృత్యువాతపడిన ఘటన కర్ణాటకలో విషాదం రేపింది.
రామనగర: కర్ణాటకలో పెను విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు కావేరి నదిలో దిగిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు విగతజీవులుగా మారారు. రామనగర జిల్లా కనకపురలో మేకెదాటు వద్ద కావేరీ నది సంగమంలో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు కాగా.. ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు నుంచి 12మంది కాలేజీ విద్యార్థులు కలిసి ఇక్కడికి వచ్చారని.. వీరిలో ఐదుగురు ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు సతనూరు పోలీసులు తెలిపారు. మృతులను హర్షిత (20), అభిషేక్ (20), తేజస్ (21), వర్ష (20), నేహా (19)గా గుర్తించామన్నారు. తొలుత ఒక విద్యార్థి ఈత కొట్టేందుకు నదిలోకి దిగి కొట్టుకుపోగా.. అతడిని కాపాడేందుకు దిగిన విద్యార్థులు.. ఒకరితర్వాత ఒకరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య
అంగన్వాడీ ఉపాధ్యాయిని హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. -
మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం.. సీసీ కెమెరాలో రికార్డు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. -
తెదేపా కార్యకర్తపై క్రికెట్ స్టంప్తో దాడి
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. -
ఒక దొంగ.. 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం
ఒకే ఒక్కడు... ఒకే ఏడాది 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం. నిరుడు దేశంలోని వివిధ నగరాలను విమానాల్లో చుట్టేసిన అతను ఒక దొంగ అంటే నమ్ముతారా? కేవలం విమాన ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఘరానా దొంగ దిల్లీ పోలీసులకు చిక్కాడు. -
30 మంది మావోయిస్టుల అరెస్టు
ఛత్తీస్గఢ్ బీజాపుర్ జిల్లాలో 9 మంది కీలక మావోయిస్టు నేతలు సహా 30 మంది దళ సభ్యులు మంగళవారం పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. -
మిధాని అదనపు జనరల్ మేనేజర్పై సీబీఐ కేసు
కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన కంచన్భాగ్ మిధాని (మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్) అదనపు జనరల్ మేనేజర్ టి.జానకిరాంపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. -
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
పెంపుడు కుక్క దాడిలో పసికందు మృతి
అప్పటి వరకు తల్లి ఒడిలో ఆడుకున్న చిన్నారిపైకి ఓ శునకం మృత్యువై వచ్చింది. తీవ్రంగా దాడి చేయడంతో ఆ ఐదు నెలల పసిప్రాణం విలవిల్లాడింది. రక్తపు మడుగులో ఉన్న బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే మృతిచెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
-
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
-
భోజనానికి ముందూ, తర్వాత టీ, కాఫీ తాగుతున్నారా.. బీ అలర్ట్!