Hyderabad News: 24 గంటలు గడవక ముందే మరో పెళ్లి.. భర్త ఇంటిముందు ఆందోళన

పెళ్లైన 24 గంటలు గడవకముందే నన్ను ప్రేమించి మరో యువతితో పెళ్లి చేసుకోవడం ఏంటంటూ.. పెళ్లి బాజాలు మోగిన ఇంటి ముందు ఓ యువతి నిరసనకు దిగిన ఘటన గురువారం హబ్సిగూడ డివిజన్‌ వెంకట్‌రెడ్డినగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

Updated : 27 May 2022 10:28 IST


ప్రేమికుడి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న యువతితో మహిళా సంఘాల సభ్యులు

హబ్సిగూడ, న్యూస్‌టుడే: పెళ్లైన 24 గంటలు గడవకముందే నన్ను ప్రేమించి మరో యువతితో పెళ్లి చేసుకోవడం ఏంటంటూ.. పెళ్లి బాజాలు మోగిన ఇంటి ముందు ఓ యువతి నిరసనకు దిగిన ఘటన గురువారం హైదరాబాద్‌ హబ్సిగూడ డివిజన్‌ వెంకట్‌రెడ్డినగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన శ్రీకాంత్‌చారీ.. తాను 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని రామంతాపూర్‌కు చెందిన లక్ష్మి(29) తెలిపింది.

తనను కాదని బుధవారం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని వాపోయింది. ప్రేమ పేరిట మోసం చేసి మరొక వివాహం చేసుకున్న శ్రీకాంత్‌చారీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. బాధితురాలు గురువారం నిందితుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆదర్శ మహిళా సంఘం సభ్యులు మద్దతు తెలిపారు. ప్రేమ, పెళ్లి కథ చివరకు ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. లక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు. నిరసనలో ప్రతిభా, మంజుల, సంధ్య, బేగం, జానకి, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని