Hyd News: కుమారుడికి తెలివితేటలెక్కువ.. అతనిపై తల్లికి ప్రేమెక్కువ

కేపీహెచ్‌బీ పరిధిలో ఈనెల 9న తల్లి సరళ, కుమారుడు సందీప్‌ బలవన్మరణానికి పాల్పడగా ఈనెల 13న వెలుగులోకి వచ్చిన ఘటనలో అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు.

Updated : 15 Jun 2022 09:47 IST


సందీప్‌, తల్లి సరళ

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: కేపీహెచ్‌బీ పరిధిలో ఈనెల 9న తల్లి సరళ, కుమారుడు సందీప్‌ బలవన్మరణానికి పాల్పడగా ఈనెల 13న వెలుగులోకి వచ్చిన ఘటనలో అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. వీరు బృందావన్‌ కాలనీలోని రిషి కల్యాణ్‌ రెసిడెన్సీలో 14 నెలల కిందట ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వారి గురించి పలు వివరాలను ‘ఈనాడు’ సేకరించింది. సందీప్‌.. ఎమ్మెస్సీ క్రిమినాలజీ చదివి సివిల్స్‌లో మంచి మార్కులు సాధించాడు. అయితే రెండుసార్లు మౌఖిక పరీక్షలో విఫలమయ్యాడు. 2018 వరకు ప్రయత్నించాడు. తర్వాత విరమించుకొని రియల్‌ ఎస్టేట్‌ చేసేవాడు. ఇతనికి డ్రాఫ్టింగ్‌లో మంచి పట్టుందని బంధువులు తెలిపారు. పెద్ద కంపెనీలతోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు తమ ఫైళ్లు తీసుకొచ్చి సందీప్‌తో డ్రాఫ్టింగ్‌ చేయించుకునేవారట. సరళకు కొడుకుపై అమితమైన ప్రేమ ఉండేది. ఈనెల 9న సాయంత్రం సందీప్‌ పడకగదిలో ఉరివేసుకున్నాడు. సరళ అది చూసి తట్టుకోలేక ఆమె కూడా ఉరివేసుకుని ఉంటుందని చుట్టుపక్కలవారు, బంధువులు తెలిపారు. మంగళవారం అంబర్‌పేట శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని