Hyd News: కుమారుడికి తెలివితేటలెక్కువ.. అతనిపై తల్లికి ప్రేమెక్కువ
కేపీహెచ్బీ పరిధిలో ఈనెల 9న తల్లి సరళ, కుమారుడు సందీప్ బలవన్మరణానికి పాల్పడగా ఈనెల 13న వెలుగులోకి వచ్చిన ఘటనలో అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు.
కేపీహెచ్బీకాలనీ, న్యూస్టుడే: కేపీహెచ్బీ పరిధిలో ఈనెల 9న తల్లి సరళ, కుమారుడు సందీప్ బలవన్మరణానికి పాల్పడగా ఈనెల 13న వెలుగులోకి వచ్చిన ఘటనలో అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. వీరు బృందావన్ కాలనీలోని రిషి కల్యాణ్ రెసిడెన్సీలో 14 నెలల కిందట ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వారి గురించి పలు వివరాలను ‘ఈనాడు’ సేకరించింది. సందీప్.. ఎమ్మెస్సీ క్రిమినాలజీ చదివి సివిల్స్లో మంచి మార్కులు సాధించాడు. అయితే రెండుసార్లు మౌఖిక పరీక్షలో విఫలమయ్యాడు. 2018 వరకు ప్రయత్నించాడు. తర్వాత విరమించుకొని రియల్ ఎస్టేట్ చేసేవాడు. ఇతనికి డ్రాఫ్టింగ్లో మంచి పట్టుందని బంధువులు తెలిపారు. పెద్ద కంపెనీలతోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు తమ ఫైళ్లు తీసుకొచ్చి సందీప్తో డ్రాఫ్టింగ్ చేయించుకునేవారట. సరళకు కొడుకుపై అమితమైన ప్రేమ ఉండేది. ఈనెల 9న సాయంత్రం సందీప్ పడకగదిలో ఉరివేసుకున్నాడు. సరళ అది చూసి తట్టుకోలేక ఆమె కూడా ఉరివేసుకుని ఉంటుందని చుట్టుపక్కలవారు, బంధువులు తెలిపారు. మంగళవారం అంబర్పేట శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.