Bapatla: వైకాపా కార్యకర్త ఇంట్లో దిల్లీ మద్యం

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెంలోని సత్యవతిపేటలో వైకాపా కార్యకర్త కప్పల నారాయణరెడ్డి ఇంట్లో దిల్లీ మద్యం సీసాలు పట్టుబడ్డాయి.

Updated : 25 Jun 2023 10:19 IST

227 సీసాలను స్వాధీనం చేసుకున్న బాపట్ల సెబ్‌ అధికారులు

కర్లపాలెం, బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెంలోని సత్యవతిపేటలో వైకాపా కార్యకర్త కప్పల నారాయణరెడ్డి ఇంట్లో దిల్లీ మద్యం సీసాలు పట్టుబడ్డాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బాపట్ల సెబ్‌ సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి శనివారం తెల్లవారుజామున దాడి చేసి రూ.1.50 లక్షలు విలువ చేసే 227 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ వివరాలను జిల్లా సెబ్‌ అధికారి నరసింహరావు బాపట్ల సెబ్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలేనికి చెందిన వైకాపా కార్యకర్త మారుబోయిన వెంకటేశ్వరరెడ్డి దిల్లీలో తక్కువ ధరకు మద్యం సీసాలు కొనుగోలు చేసి రైలులో తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. తొలుత పదుల సంఖ్యలో మద్యం సీసాలు తెచ్చి తన మామ కప్పల నారాయణరెడ్డితో కలిసి విక్రయించేవారు. ఆదాయం బాగా వస్తుండడంతో ఇద్దరూ దిల్లీ వెళ్లి వందల సంఖ్యలో మద్యం సీసాలు కొనుగోలు చేసి సత్యవతిపేటలోని నారాయణరెడ్డి ఇంట్లో నిల్వ చేస్తున్నారు. వాటిని స్థానికంగానే కాకుండా జిల్లాలోని నిజాంపట్నంలోనూ విక్రయిస్తున్నారు. దిల్లీలో ఒక్కో సీసా రూ.130 చొప్పున కొనుగోలు చేసి ఇక్కడ రూ.600 నుంచి రూ.700 వరకు విక్రయిస్తూ లాభం గడిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని