మట్టిపాలైన బతుకులు!
రోజువారీగా కూలి పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్న పేదలు వారు.. కిరాణా దుకాణానికి వెళ్తున్న ఆ ముగ్గురిని వర్షానికి తడిసిన పురాతన మట్టి గోడ బలితీసుకుంది. పేద కుటుంబాల్లో విషాదం నింపింది.
గోడ కూలి ముగ్గురి దుర్మరణం
హనుమకొండ జిల్లాలో విషాదం
శాయంపేట, న్యూస్టుడే: రోజువారీగా కూలి పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్న పేదలు వారు.. కిరాణా దుకాణానికి వెళ్తున్న ఆ ముగ్గురిని వర్షానికి తడిసిన పురాతన మట్టి గోడ బలితీసుకుంది. పేద కుటుంబాల్లో విషాదం నింపింది. హనుమకొండ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట మండల కేంద్రానికి చెందిన మోరె పెద్దసాంబయ్య(60), లోకలబోయిన సారలక్ష్మి(50), భోగి జోగమ్మ(65) శుక్రవారం ఉదయం నిత్యావసరాల కొనుగోలు కోసం సమీపంలోని కిరాణా దుకాణానికి ఓ మట్టి గోడ వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బాగా తడిసిన ఆ పురాతన గోడ వీరిపై ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఈ ముగ్గురూ గోడ మట్టి, ఇటుక పెళ్లల్లో కూరుకుపోయారు. గమనించిన స్థానికులు వీరిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన పెద్దసాంబయ్య, సారలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జోగమ్మను అంబులెన్స్లో పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. వీరిలో పెద్దసాంబయ్య సిరిసిల్లలో రోజువారీగా మగ్గం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పింఛను తీసుకోవడానికి ఇటీవల శాయంపేటకు వచ్చారు. సారలక్ష్మి, జోగమ్మలు వితంతువులు. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై దేవేందర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్