353 కిలోల గంజాయి పట్టివేత.. నిందితుల్లో గ్రామ వాలంటీరు
అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని, అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు.
అయిదుగురు అరెస్టు
సీలేరు, న్యూస్టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని, అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో గ్రామ వాలంటీరు ఉన్నారు. చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. జీకేవీధి సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో సీలేరు ఎస్సై రామకృష్ణ, సిబ్బంది స్థానిక టీఆర్సీ క్యాంపు వద్ద గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న 353 కిలోల గంజాయి పట్టుబడింది. దాని విలువ రూ.కోటి ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి సీలేరు పంచాయతీలో వాలంటీరుగా పనిచేస్తున్న కొర్రా జగ్గారావు, సీసా లైకోన్, కిల్లో రాజు, వంతల త్రినాథ్, వెంకటేష్లను అరెస్టు చేశారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్రకు చెందిన సికిందర్ అలియాస్ సూరజ్కు భద్రాచలంలో విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మూడు ఫోన్లు, రూ.3 వేల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామని అదనపు ఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!
ఓ వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. -
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు
-
‘ఎర్ర బంగారానికి’ యుద్ధం సెగ.. కేజీ ధర @ రూ.5 లక్షలు
-
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!