353 కిలోల గంజాయి పట్టివేత.. నిందితుల్లో గ్రామ వాలంటీరు
అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని, అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు.
అయిదుగురు అరెస్టు
సీలేరు, న్యూస్టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని, అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో గ్రామ వాలంటీరు ఉన్నారు. చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. జీకేవీధి సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో సీలేరు ఎస్సై రామకృష్ణ, సిబ్బంది స్థానిక టీఆర్సీ క్యాంపు వద్ద గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న 353 కిలోల గంజాయి పట్టుబడింది. దాని విలువ రూ.కోటి ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి సీలేరు పంచాయతీలో వాలంటీరుగా పనిచేస్తున్న కొర్రా జగ్గారావు, సీసా లైకోన్, కిల్లో రాజు, వంతల త్రినాథ్, వెంకటేష్లను అరెస్టు చేశారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్రకు చెందిన సికిందర్ అలియాస్ సూరజ్కు భద్రాచలంలో విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి మూడు ఫోన్లు, రూ.3 వేల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నామని అదనపు ఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Robbery: తుపాకీ గురిపెట్టి.. బ్యాంకులో ₹18 కోట్లు దోపిడీ
ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో దుండగులు పట్టపగలే రెచ్చిపోయారు. ఉద్యోగుల్ని బెదిరించి బ్యాంకు ఖజానా నుంచి రూ.18కోట్లకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. -
Hanamkonda: సీఐ కుమారుడి నిర్లక్ష్యం.. కారు ఢీకొని మహిళ మృతి
ఓటు వేసి వెళ్తుండగా కారు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో మహిళ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. -
Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్
కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. -
Road Accident: ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి
ఒడిశాలోని కెంఝహార్ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
Nandyala: భార్యతో గొడవ.. అత్త, బావమరిదిపై కత్తితో దాడి
నంద్యాల జిల్లా పాణ్యంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అత్త, బావమరిదిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న గణేశ్ డబ్బుల కోసం తరచూ భార్య తులసితో గొడవపడుతూ ఉండేవాడు. -
ప్రియుడి సూచనతో.. లేడీస్ హాస్టల్ టాయిలెట్లో రహస్య కెమెరా!
చండీగఢ్లో ఓ యువతి తన ప్రియుడి కోరిక మేరకు లేడీస్ హాస్టలు (పీజీ) మరుగుదొడ్లో వెబ్కెమెరాను అమర్చి పోలీసులకు చిక్కింది. -
ఎన్నికల వేళ మందుపాతర కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గురువారం ఎన్నికల వేళ మావోయిస్టుల చర్యను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. -
పొలం కబ్జా యత్నంపై ఫిర్యాదు చేశాడని ఇనుప రాడ్లతో దాడి
రాష్ట్రంలో వైకాపా నేతల అకృత్యాలకు అడ్డు లేకుండా ఉంది. తన పొలం కబ్జా యత్నంపై ఫిర్యాదు చేశాడన్న కక్షతో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిపై ఇనుపరాడ్లతో మూకుమ్మడి దాడి చేశారు. -
బ్యాంకులో 7 కేజీల ఆభరణాల గల్లంతు
శ్రీకాకుళం జిల్లా గారలోని స్టేట్ బ్యాంక్ శాఖలో ఖాతాదారులు కుదువ పెట్టిన 7 కేజీల బంగారు ఆభరణాలు గల్లంతయ్యాయి. -
ఈస్ట్కోస్ట్ రైలులో పొగలు
వేగంగా వెళుతున్న రైలులో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన ఘటన యాదగిరిగట్ట మండలం వంగపల్లి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. -
కల్తీ ఔషధం తాగి గుజరాత్లో అయిదుగురి మృతి
గుజరాత్లోని ఖేడా జిల్లాలో గురువారం దారుణం జరిగింది. మిథైల్ ఆల్కహాల్ కలిగి ఉన్న ఆయుర్వేద ఔషధాన్ని తాగి అయిదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Mizoram Elections: మిజోరం ఓట్ల లెక్కింపు తేదీ మార్పు
-
Revanth reddy: అన్ని ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలి: రేవంత్రెడ్డి
-
IND vs SA: అతడికి ఓ లాలీపాప్ ఇచ్చారు.. చాహల్ను వన్డేలకు ఎంపిక చేయడంపై హర్భజన్
-
Telsa: టెస్లాకు ప్రత్యేక మినహాయింపులు ఉండవ్!
-
Social Look: చీరలో మెరిసిన త్రిష.. పూజ క్విక్ పిక్..!