ప్రియుడితో ఉండగా చూశారని.. చెల్లెళ్లను చంపిన అక్క

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్రాయ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ఓ యువతి తన ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చూశారని సొంత చెల్లెళ్లనే హతమార్చింది.

Updated : 11 Oct 2023 09:26 IST

త్తర్‌ప్రదేశ్‌లోని బల్రాయ్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ఓ యువతి తన ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చూశారని సొంత చెల్లెళ్లనే హతమార్చింది. బహదూర్‌పుర్‌ గ్రామానికి చెందిన అంజలి (20) తల్లిదండ్రులు లేని సమయంలో ప్రియుణ్ని ఇంటికి పిలిచింది. అతడితో ఆమె సన్నిహితంగా ఉండగా.. ఆరు, నాలుగేళ్ల వయసున్న చెల్లెళ్లు చూశారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతారేమోనని భయపడిన అంజలి చిన్నపిల్లలని కూడా చూడకుండా పదునైన ఆయుధంతో చెల్లెళ్లను హత్య చేసింది. చెల్లెళ్లను ఎవరో చంపేశారని తల్లిదండ్రుల ముందు కట్టుకథ సృష్టించింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలతో ఉన్న అంజలి దుస్తులను గుర్తించిన పోలీసులు ఆమెను నిలదీశారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ కేసులో అంజలికి మరికొందరు సహకరించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని