Bapatla: ఐదో తరగతి విద్యార్థినిపై హెచ్ఎం లైంగిక వేధింపులు
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పి ఐదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన బాపట్లలో గురువారం చోటుచేసుకుంది.
పోక్సో చట్టం కింద కేసు నమోదు
బాపట్ల, న్యూస్టుడే: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పి ఐదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన బాపట్లలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పట్టణంలోని మల్లికార్జున బృందావనం కాలనీ పురపాలక ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పి.రామచంద్రరావు ఎక్కాలు చెబుతానంటూ బాలికను ఒంటరిగా గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత విద్యార్థిని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు జరిగిన ఘటన తెలియజేసి విలపించింది. వారు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకటేశులు, పట్టణ సీఐ శ్రీనివాసులు.. బాధితురాలు, కుటుంబసభ్యులను విచారించి వివరాలు నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా కార్యకర్తపై క్రికెట్ స్టంప్తో దాడి
శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా అల్లరిమూకలు రెచ్చిపోయాయి. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. -
ఒక దొంగ.. 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం
ఒకే ఒక్కడు... ఒకే ఏడాది 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం. నిరుడు దేశంలోని వివిధ నగరాలను విమానాల్లో చుట్టేసిన అతను ఒక దొంగ అంటే నమ్ముతారా? కేవలం విమాన ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఘరానా దొంగ దిల్లీ పోలీసులకు చిక్కాడు. -
30 మంది మావోయిస్టుల అరెస్టు
ఛత్తీస్గఢ్ బీజాపుర్ జిల్లాలో 9 మంది కీలక మావోయిస్టు నేతలు సహా 30 మంది దళ సభ్యులు మంగళవారం పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. -
మిధాని అదనపు జనరల్ మేనేజర్పై సీబీఐ కేసు
కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన కంచన్భాగ్ మిధాని (మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్) అదనపు జనరల్ మేనేజర్ టి.జానకిరాంపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. -
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. -
పెంపుడు కుక్క దాడిలో పసికందు మృతి
అప్పటి వరకు తల్లి ఒడిలో ఆడుకున్న చిన్నారిపైకి ఓ శునకం మృత్యువై వచ్చింది. తీవ్రంగా దాడి చేయడంతో ఆ ఐదు నెలల పసిప్రాణం విలవిల్లాడింది. రక్తపు మడుగులో ఉన్న బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే మృతిచెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు.. మాకు హితబోధలా?: వెస్టర్న్ మీడియాకు జైశంకర్ చురకలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణాలో వైకాపా ఆనవాళ్లు మిగలవు: ఎంపీ బాలశౌరి
-
ఎవరి లెక్కలు వారివే.. భారీ ఆధిక్యంపై కాంగ్రెస్ ధీమా
-
ఆంధ్రప్రదేశ్లో 44 రోజులు... రూ.17 వేల కోట్ల అప్పులు
-
హైదరాబాద్ జూలో తెల్ల పులి మృత్యువాత