Crime News: యువతిని చంపి.. డిక్కీలో దాచిపెట్టాడు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పుర్‌లో ఓ యువతిని సహోద్యోగి దారుణంగా హత్య చేసి కారు డిక్కీలో దాచిపెట్టాడు.

Published : 21 Nov 2022 08:19 IST

ఛత్తీస్‌గఢ్‌లో సహోద్యోగి కిరాతకం

బిలాస్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పుర్‌లో ఓ యువతిని సహోద్యోగి దారుణంగా హత్య చేసి కారు డిక్కీలో దాచిపెట్టాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు ఆశిశ్‌ సాహూను అరెస్ట్‌ చేశారు. హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. భిలాయికి చెందిన ప్రియాంకసింగ్‌ అనే యువతి దయాల్‌బంద్‌ ప్రాంతంలో నివసిస్తూ.. ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. గత నాలుగు రోజులుగా ఈమె కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రియాంక కాల్‌ డేటాను పరిశీలించగా.. చివరగా తన సహోద్యోగి ఆశిశ్‌తో మాట్లాడినట్లు తేలింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రియాంకను గొంతు నులిమి హత్య చేసి.. మృతదేహాన్ని కారులో దాచిపెట్టానని అంగీకరించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డోరు తెరవగా ఆ ప్రాంతమంతా దుర్వాసన వ్యాపించింది. మృతదేహం కుళ్లిపోయిందని, యువతి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని.. ఫలితాలు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని