టాయిలెట్ క్లీనర్ మీద పోసుకొని.. యాసిడ్ దాడిగా నాటకం
దిల్లీ విద్యార్థిని వ్యవహారంలో అనూహ్య మలుపు
దిల్లీ: తనపై యాసిడ్ దాడి జరిగిందంటూ దేశ రాజధాని దిల్లీలో 20 ఏళ్ల ఓ విద్యార్థిని ఆదివారం ఆరోపించిన వ్యవహారం తాజాగా అనూహ్య మలుపు తిరిగింది. ఆమెపై యాసిడ్ దాడి జరగలేదని నిర్ధారణ అయింది. టాయిలెట్ క్లీనర్ను తనపై తానే పోసుకొని ఆమె అలా నాటకమాడిందని పోలీసులు తేల్చారు. తండ్రి ప్రేరేపించడంతోనే అలా చేసిందని గుర్తించారు. ఓ అత్యాచారం కేసులో అతణ్ని సోమవారం అరెస్టు చేశారు. దిల్లీ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని.. ఆదివారం ఉదయం అదనపు తరగతికి హాజరయ్యేందుకు వెళ్తుండగా తనపై ముగ్గురు వ్యక్తులు- జితేందర్, ఇషాన్, అర్మాన్ యాసిడ్తో దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు విస్మయం కలిగించే పలు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
ప్రతీకారం కోసం కట్టుకథ
తనపై దాడి చేసినట్లు విద్యార్థిని చెప్పిన ముగ్గురు వ్యక్తులు అసలు ఆ సమయంలో ఘటనాస్థలంలో లేరని పోలీసులు ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. జితేందర్ తన భార్యతో కలిసి అప్పుడు ఘటనాస్థలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఇషాన్, అర్మాన్ (వీరిద్దరూ సోదరులు. విద్యార్థినికి దూరపు బంధువులు) కూడా ఆగ్రాలో ఉన్నట్లు తేలింది. మరోవైపు- విద్యార్థిని తండ్రి అకిల్ ఖాన్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు జితేందర్ భార్య అప్పటికే ఫిర్యాదు చేసి ఉన్న సంగతిని పోలీసులు గుర్తించారు. ఇక ఇషాన్, అర్మాన్లతో అకిల్ ఖాన్కు ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతణ్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించగా అసలు విషయాలు అంగీకరించాడు. జితేందర్, ఇషాన్, అర్మాన్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు తండ్రి ప్రేరేపించడంతోనే.. విద్యార్థిని తమ ఇంటి నుంచి తెచ్చుకున్న సాధారణ టాయిలెట్ క్లీనర్ను మీద పోసుకొని యాసిడ్ దాడిగా నాటకాలాడిందని పోలీసులు చెప్పారు. అకిల్ ఖాన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఇషాన్, అర్మాన్ల తల్లి కూడా 2018లో ఆరోపించడం గమనార్హం. యాసిడ్ దాడి కట్టుకథ అల్లడంతోపాటు జితేందర్ భార్య చేసిన అత్యాచార ఆరోపణ కేసులో అకిల్ ఖాన్ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

రహదారులపై రక్తధారలు
సాఫీగా సాగాల్సిన ప్రయాణాల్లో అనూహ్య ప్రమాదాలు... నెత్తుటి ధారలతో తడిచిన రహదారులు... ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యుల రోదనలు... వెరసి రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకున్న మూడు వేర్వేరు ప్రమాదాలు ఏడుగురిని పొట్టన పెట్టుకోగా 23 మంది గాయపడ్డారు. - 
                                    
                                        

నకిలీ మద్యం కేసులో మరో నలుగురు నిందితులు
నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది. - 
                                    
                                        

ప్రియుడిపై దాడిచేసి.. యువతిపై సామూహిక అత్యాచారం
ప్రేమజంట కారులో కూర్చొని మాట్లాడుకుంటుండగా అక్కడకు వచ్చిన దుండగులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. - 
                                    
                                        

కొత్త ఫోన్ కోసం వచ్చి...
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్లో నివాసముంటున్న గుర్రాల శ్రీనివాస్రెడ్డి కుమార్తె అఖిలారెడ్డి గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నారు. - 
                                    
                                        

గుంతలో పడి చిన్నారి మృతి
అభం... శుభం... తెలియని ఓ చిన్నారి అనుకోని పరిస్థితిలో అసువులు బాశాడు. విద్యాబుద్ధులు నేర్చుకుందామని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారిని ప్రమాదకర నీటిగుంత పొట్టన పెట్టుకుంది. - 
                                    
                                        

నాడు పెనుకొండలోనూ ఇదే తరహా ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన ప్రమాదం... పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుకొండ స్టేషన్ సమీపంలో జరిగిన దుర్ఘటన ఒకే తరహాలో ఉన్నాయి. - 
                                    
                                        

అక్షర దీపికలు... ఇక కానరారు!
తండ్రి కారు డ్రైవర్. తల్లి గృహిణి. వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు తాండూరులో నివాసముంటున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియ, నందిని, తనూషలు చిన్నప్పటి నుంచి పట్టుదలగా చదివారు. - 
                                    
                                        

రాజస్థాన్లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం
నియంత్రణ కోల్పోయిన ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ 14 మంది మృతికి కారణమయ్యాడు. దాదాపు 300 మీటర్ల మేర 17కి పైగా వాహనాలను ఢీకొంటూ వెళ్లి మరో 13 మందిని గాయపరిచాడు. - 
                                    
                                        

ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులు.. తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ బలవన్మరణం
సంగారెడ్డి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కొఠారి సందీప్కుమార్(23) పట్టణ శివారులోని మహబూబ్సాగర్ కట్టపై తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్యాదవ్ కౌంటర్ దాఖలు
 


