పరీక్షకు ముందు ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆత్మహత్య

Eenadu icon
By Crime News Desk Published : 01 Nov 2025 03:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

జైపుర్‌: పరీక్షకు ముందు ఎంబీబీఎస్‌ విద్యార్థి ఒకరు హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో చోటుచేసుకుంది. అల్వర్‌కు చెందిన అవీరల్‌ సైనీ (23) ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం అతడు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఉదయం సైనీ స్నేహితులు అతణ్ని నిద్రలేపడానికి వెళ్లగా గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినప్పటికీ అతని నుంచి సమాధానం రాకపోయేసరికి కిటికీలోంచి చూడగా, సైనీ ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు