scam alert: హెచ్ఆర్ ఇంటర్వ్యూ పేరిట లింక్ పంపి రూ.2.5 లక్షలకు టోకరా!
Scam alert: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిని ఆసరాగా చేసుకొని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. హెచ్ఆర్ రౌండ్ అంటూ ఫేక్ లింక్ పంపి పెద్ద మొత్తంలో డబ్బును దోచుకుంటున్నారు.
scam alert | ఇంటర్నెట్డెస్క్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ పేట్రేగిపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా అధిక రాబడులు, ఉద్యోగాలు అంటూ వినూత్న పద్ధతుల్లో ప్రజల్ని బోల్తా కొట్టించి పెద్దఎత్తున డబ్బులు ఎగరేసుకుపోతున్నారు. తాజాగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి దగ్గర హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని నమ్మించి రూ.రెండున్నర లక్షలు కొట్టేశారు.
పుణెకు చెందిన నవేద్ ఆలం అనే ఓ ప్రొడక్ట్ డిజైనర్ తాజాగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. ‘ఎక్స్’ వేదికగా తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘‘ఇటీవల ఓ కంపెనీ పేరుతో నడుపుతున్న ఖాతా నుంచి మెసేజ్ వచ్చింది. ‘మా ప్లాట్ఫామ్లో పనిచేయడానికి ఓ డిజైనర్ కోసం ఎదురుచూస్తున్నాం. మీ పోర్ట్ఫోలియో నచ్చింది’ అంటూ డిజైన్కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం చెప్పాక హెచ్ఆర్ రౌండ్ అంటూ ఓ అభ్యర్థన వచ్చింది. లింక్ సాయంతో ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. లింక్పై క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఆప్షన్ చూపించింది. కమ్యూనికేషన్ కోసమే కదా అంటూ చూపించిన దాన్ని డౌన్లోడ్ చేశాను. అది ఫేక్ అకౌంట్ అని తెలుసుకోలేకపోయా. అంతే క్షణాల్లో తన క్రిప్టో వాలెట్లోని 2000 డాలర్లు (రూ.2.5 లక్షలు) మాయమయ్యాయి’’ అంటూ రాసుకొచ్చారు.
మహారాష్ట్రలో అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి
అకౌంట్ ఖాతాను ట్యాగ్ చేస్తూ కేటుగాళ్లతో జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్షాట్ను నవేద్ ఆలం పోస్ట్ చేశాడు. ఉద్యోగం అంటూ ఏవైనా ఆఫర్లు వస్తే వెంటనే అది నిజమైన సంస్థో.. కాదో తెలుసుకున్నాకే వారు పంపిన లింక్లపై క్లిక్ చేయండి అంటూ నెటిజన్లు సూచనలు చేశారు. నవేద్ పంచుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై కొందరు నెటిజన్లు స్పందించారు. ‘‘నేను కూడా ఇలాంటి స్కామ్ల బారినపడి పొదుపు చేసిన డబ్బంతా పోగొట్టుకున్నాను’’ అంటూ ఓ యూజర్ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇదే తరహాలో చాలామంది తమకు ఎదురైన సంఘటనలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్