Eluru: ఓవర్ టేక్ చేస్తూ లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పులివాగు వంతెన వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Updated : 26 Aug 2023 10:47 IST

కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పులివాగు వంతెన వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సులో కోనసీమ జిల్లాలోని వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి.. సుమారు 52 మంది ప్రయాణికులు శనివారం ఉదయం బయలుదేరారు. ఈ క్రమంలో కొయ్యలగూడెం గ్రామ సమీపంలోని పులివాగు వంతెన వద్దకు రాగానే.. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న మరో లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొంది. 

ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని