Korutla:: దీప్తి శరీరంపై గాయాలు.. పోస్టుమార్టం నివేదికే కీలకం
కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తి మృతదేహానికి కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు.
కోరుట్ల: కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తి మృతదేహానికి కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. చేయి, ఛాతి, చెంప భాగంలో గాయాలున్నట్టు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో బుధవారం సాయంత్రం కోరుట్లలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మిస్టరీగా మారిన ఈ కేసులో ప్రస్తుతం పోస్టు మార్టం నివేదిక కీలకంగా మారింది.
మరో వైపు .. దీప్తి మృతి చెందిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆమె సోదరి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు. మెట్ పల్లి డీఎస్పీ రవీంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దీప్తి మృతి తర్వాత ఇంటి నుంచి వెళ్లి పోయిన ఆమె సోదరి పంపిన ఆడియో మెస్సేజ్ చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఆడియో మెస్సేజ్ను మాధ్యమాల్లో ప్రసారం చేయొద్దని పోలీసులు సూచించారు.
ఏం జరిగిందంటే?
కోరుట్ల పరిధిలోని భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి(24), చందన, సాయి సంతానం. దీప్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు. చందన బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటున్నారు. కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. బంధువుల గృహప్రవేశం ఉండటంతో ఆదివారం... శ్రీనివాస్రెడ్డి, మాధవి హైదరాబాద్కు వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటలకు వారిద్దరూ కుమార్తెలతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేయగా దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చందన ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి సమాచారమివ్వగా వారొచ్చి... దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు.
డీఎస్పీ రవీందర్రెడ్డి, కోరుట్ల, మెట్పల్లి సీఐలు ప్రవీణ్కుమార్, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉండగా, వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్డ్రింక్ బాటిల్, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడు కలిసి ఉదయం 5.12 నుంచి 5.16 గంటల వరకు నిజామాబాద్ బస్సులు ఆగేచోట కూర్చుని, కొద్దిసేపటికి నిజామాబాద్ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. చందన, ఆమె వెంటున్న యువకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి? ఇంకెవరైనా మద్యం తాగారా? చందన ఎందుకు పారిపోయిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
బెట్టింగ్లకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్న కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది. -
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి
నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. -
రసాయనాల మాటున కరెన్సీ కట్టలు
విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై గుట్టుగా తరలిస్తున్న రూ.7 కోట్ల డబ్బు కట్టలు రోడ్డు ప్రమాదం కారణంగా బయటపడ్డాయి. -
ఆరు ప్రాణాలు బలిగొన్న మద్యం
ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన ఓ వ్యక్తి అయిదుగురు కుటుంబసభ్యులను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ (42) మద్యానికి బానిసై కుటుంబసభ్యులతో తరచూ గొడవ పడేవాడు. -
కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి
వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంటు లక్ష్మి(70) శనివారం ఉదయం బహిర్భూమికి ఊరి చివరకు వెళ్లారు. -
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. -
రూ.2 కోట్ల విలువైన మద్యం పట్టివేత
ఎన్నికల వేళ అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ ఠాణాలో సీఐ నాగార్జునగౌడ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
రేవణ్న లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో దేవరాజ గౌడ
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి వీడియోను లీక్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడు, ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భాజపా నేత దేవరాజ గౌడను చిత్రదుర్గం జిల్లా హిరియూరు గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. -
ఇసుక లారీ ఢీ.. ఇద్దరు ప్రయాణికుల మృతి
బస్షెల్టర్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై శనివారం సాయంత్రం ఇసుక లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు, ఐఈడీ పేలి బాలిక మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతరి, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మావోయిస్టు, మరో బాలిక మృతి చెందారు. దంతరి జిల్లా బైసాముండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..
-
మీకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి!
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
-
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
-
కష్టంగా కాదు.. ఇష్టంగా ఓటింగ్ : ఆస్ట్రేలియాలో ఎన్నికల శైలి
-
నిజ్జర్ హత్య కేసు.. మరో అనుమానితుడి అరెస్టు