బాలిక హత్యకేసు.. కలెక్టర్ హామీతో ఆందోళన విరమించిన స్థానికులు
నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనపై
హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు ఎట్టకేలకు కలెక్టర్ హామీతో ఆందోళన విరమించారు. చంపాపేట నుంచి సాగర్ వెళ్లే రోడ్డులో కాలనీవాసులు బైఠాయించి దాదాపు 7 గంటల పాటు నిరసన తెలిపారు. బాలికపై అత్యాచారం చేసి చంపేశాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయడంతో పాటు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మరోవైపు బాధితుల ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు యత్నించినా ఫలితంలేకపోయింది. వారిని సముదాయించేందుకు ఎంత ప్రయత్నించినా ఆందోళనకారులు, బాధిత కుటుంబసభ్యులు వెనక్కి తగ్గ లేదు.
అత్యాచారం చేసి గొంతునులిమి హత్యచేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ఈ క్రమంలో ఆందోళనకారుల వద్దకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, డీసీసీ రమేశ్రెడ్డి వచ్చి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని.. రెండు పడక గదుల ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.50వేలు అందజేశారు. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. బెల్టు షాపులు, గుడుంబా లేకుండా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో ఆందోళన విరమించారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని డీసీపీ రమేశ్రెడ్డి తెలిపారు. మరోవైపు నిందితుడి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సమాచారం కోసం వారిని ప్రశ్నిస్తున్నారు. సైదాబాద్ సింగరేణి ప్రాంతంలో సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. చిన్నారి మృతదేహానికి ఉస్మానియా మర్చురీలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి చిన్నారిని హత్యచేసినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్