Medak: టైరు పేలి రాంగ్‌రూట్‌లోకి కారు.. ఆపై లారీ ఢీ కొనడంతో ఇద్దరి మృతి

మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు దుర్మరణం చెందారు.

Updated : 22 Jul 2023 12:43 IST

చేగుంట: మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు దుర్మరణం చెందారు. నార్సింగి మండలం నర్సంపల్లికి చెందిన తౌర్య నాయక్ (50) తన చిన్న కుమారుడు అంకిత్‌ (10)తో కలిసి కారులో చేగుంటకు బయలు దేరారు. వల్లూరు అటవి ప్రాంతంలో జాతీయ రహదారిపై టైరు పేలడంతో.. కారు డివైడర్‌ను దాటి రాంగ్‌రూట్‌లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి వస్తున్న కంటైనర్.. కారును ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తౌర్య నాయక్‌ గతంలో నార్సింగి మండల భారాస అధ్యక్షుడిగా పని చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను రామాయంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని