అమానవీయం.. రీల్స్ చేయడానికి ఐఫోన్ కోసం బిడ్డను అమ్మేశారు
సామాజిక మాధ్యమాల మోజులో పడి చాలా మంది కుటుంబ బంధాలను తెంచేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణగా నిలిచే ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది.
కోల్కతా: ఆకలేస్తే ఏడవడం.. ఆ ఏడుపు విని.. అమ్మ చేతుల్లోకి తీసుకోగానే.. చనుబాలు తాగి, హాయిగా అమ్మ పొత్తిళ్లలో నిద్రపోవడం. అంతే ఆ పసికందుకు తెలిసింది. అమ్మతనం చేతులు మారినా.. కన్నతల్లి తనను అంగట్లో సరుకులా అమ్మేసినా.. ఎప్పటిలానే ఆకలేయగానే ఏడవడం మినహా ఏం చేయలేని నిస్సహాయత. ఒకవేళ ఆ పసికందు పెరిగి పెద్దయ్యాక నిజం తెలిస్తే.. ఎందుకు తనను అంగట్లో సరుకును చేశారని తప్పక ప్రశ్నిస్తాడు. కన్నవారి దౌర్భ్యాగపు ఆలోచనను తప్పక ఛీత్కరించుకుంటాడు.
సామాజిక మాధ్యమాల మోజులో పడి చాలా మంది కుటుంబ బంధాలను తెంచేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణే పశ్చిమ బెంగాల్ (West Bengal)లో చోటుచేసుకున్న ఈ ఘటన. సోషల్ మీడియా రీల్స్ మోజులో పడి ఐఫోన్ (iPhone) కోసం కన్న కొడుకునే అమ్మేసిన ఆ దంపతుల చర్య సభ్యసమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పానిహతిలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన జయదేవ్, సాథి దంపతులకు ఏడేళ్ల కూతురు, 8 నెలల కొడుకు ఉన్నారు. కొద్దిరోజులుగా భార్యభర్తల ప్రవర్తనలో మార్పురావడం చుట్టుపక్కల ఉండే వారికి అనుమానం కలిగింది. వారితోపాటు 8 నెలల కొడుకు కనిపించకపోవడం ఆ అనుమానాన్ని మరింత బలపరిచింది. దాంతోపాటు ఆ దంపతులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గుర్తించారు. పసికందు గురించి స్థానికులు ప్రశ్నించగా.. అమ్మేసినట్లు జయదేవ్, సాథి తెలిపారు. ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నట్లు చెప్పారు. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో భార్యభర్తలను అదుపులోకి తీసుకుని విచారించారు.
బైకర్ నిర్లక్ష్యం.. కారు ఢీకొట్టడంతో అమాంతం గాల్లోకి ఎగిరిపడిన విద్యార్థినులు
సోషల్ మీడియా రీల్స్ చేసేందుకు ఐఫోన్ కొనాలని నిర్ణయించుకుని.. బిడ్డను ఖార్దాహ్ ప్రాంతంలో నివసించే ప్రియాంక అనే మహిళకు అమ్మేసినట్లు తెలిపారు. ఆ డబ్బుతో ఐఫోన్ కొన్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. పసికందును అమ్మిన తర్వాత కుమార్తెను కూడా అమ్మేందుకు జయదేవ్ ప్రయత్నించాడని, వెంటనే పోలీసులకు సమాచారం అందించామని స్థానిక కౌన్సిలర్ తారక్ గుహ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జయదేవ్, సాథిలతోపాటు పసికందును కొన్న మహిళను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52)మృతి చెందాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!