హద్దు దాటి దోపిడీ
రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రభుత్వ చెక్పోస్టుల్లో దోపిడీ పర్వం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నెలకు సుమారుగా రూ.కోటి వరకు ప్రైవేటు సిబ్బందిని పెట్టి మరీ అధికారులు వసూలు చేస్తున్నారు
అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో నెలకు రూ. 2 కోట్ల వరకు వసూలు
వాంకిడి చెక్పోస్టు వద్ద వాహనాలు ఆపుతున్న ప్రైవేటు వ్యక్తి
ఈనాడు, ఆసిఫాబాద్: రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రభుత్వ చెక్పోస్టుల్లో దోపిడీ పర్వం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నెలకు సుమారుగా రూ.కోటి వరకు ప్రైవేటు సిబ్బందిని పెట్టి మరీ అధికారులు వసూలు చేస్తున్నారు. పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహన చోదకుల జేబులను చెక్పోస్టు నిర్వాహకులు కొల్లగొడుతున్నారు. ఈ మార్గంలోనే టోల్ప్లాజా, తెలంగాణ, మహారాష్ట్రలలో ఉన్న చెక్పోస్టులతో రూ.వేల డబ్బులు కోల్పోవాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర సరిహద్దు మండలం వాంకిడిలో ఆర్టీఏ, వ్యవసాయ, ఆబ్కారీ శాఖ చెక్పోస్టులు ఉన్నాయి. వాహనం పరిమితికి మించిన బరువుతో వెళ్తోందా లేదా, చోదకుడి, వాహన ధ్రువపత్రాలు, వేబిల్లు వంటి అంశాలు ఆర్టీఏ అధికారులు పరిశీలించాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న సరకులకు మార్కెట్ రుసుంను వ్యవసాయ మార్కెట్ అధికారులు వసూలు చేయాలి. మద్యం అక్రమ రవాణాను ఆబ్కారీ శాఖ అధికారులు నిరోధించాలి. క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా.. ఈ ప్రాంతంలో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ప్రతి చోదకుడు రూ.300 ఆర్టీఏ చెక్పోస్టులో సమర్పించుకోవాల్సిందే. చక్రాల పరిమాణం పెరిగితే ఈ ధర రూ.1000 నుంచి రూ.2000 వరకు ఉంటోంది. ఈ మార్గంలో నిత్యం 2500 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి వాహనానికి రూ.300 చొప్పున లెక్క తీసినా నిత్యం రూ.7.50 లక్షలు, నెలకు రూ.2.25 కోట్ల వరకు వసూళ్లు జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని ఈ తంతు కొనసాగిస్తున్నారు.
పత్తి వాహనానికి రూ.500
రాష్ట్ర సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని రాజురా, చంద్రపూర్ మార్కెట్లకు జిల్లా నుంచి పత్తిని తరలిస్తుంటారు. ఐచర్ వాహనంలో 25 క్వింటాళ్ల పత్తి తీసుకెళ్తారు. వ్యవసాయశాఖ చెక్పోస్టులో రూ.2500 వరకు రుసుం చెల్లించాలి. కానీ ప్రతి పత్తి వాహనానికి రూ.500 వరకు తీసుకుని సంబంధిత సిబ్బంది రశీదులు ఇవ్వకుండానే విడిచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రూ. 10 చొప్పున నిత్యం రూ. 25 వేలు
ఆబ్కారీ శాఖ అధికారులు ఒక అడుగు ముందుకు వేసి బహిరంగంగా రోడ్డు మీదే వాహనదారుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి వచ్చే ఏ వాహనమైనా ఆబ్కారీ చెక్ పోస్టు వద్ద అడ్డంగా నిల్చొన్న ప్రైవేటు వ్యక్తికి రూ.10 చోదకుడు చేతిలో పెట్టగానే దారి వదిలేస్తారు. వీరి నెల సంపాదన రూ.7.50 లక్షల వరకు ఉంటోంది.
ప్రతిసారి ఇవ్వాల్సిందే..
- యాదవ్, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని గడ్చిరోలికి ఆయిల్ ట్యాంకర్ను (ఎంహెచ్34జీ 6339) తీసుకెళ్తున్నాను. రూ.400 ఆర్టీఏ చెక్పోస్టులో తీసుకున్నారు. ఆరు కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్రలో రూ.1000, వాంకిడి వద్ద టోల్ప్లాజా రూ.300 ఈ విధంగా వచ్చిన ప్రతిసారి అధికంగా ఇవ్వాల్సి వస్తోంది.
రూ. 600 తీసుకున్నారు
- పవన్, చోదకుడు
మహారాష్ట్రకు గోధుమల లోడ్తో వాహనాన్ని (ఎంహెచ్40 సీజీ 1323) తీసుకెళ్తున్నా. 16 చక్రాల వాహనం ఉండడం వల్ల రూ.500 మొదలు తీసుకున్నారు. అనంతరం మరో వంద ఇవ్వాలని పిలిచి మరీ రూ.600 తీసుకున్నారు. అన్ని రకాల పేపర్లు ఉన్నాయి. అయినా ప్రతిసారి ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.40 లక్షలు పట్టివేత
[ 12-05-2024]
జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద రూ.2.40 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కూలిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం టెంట్లు
[ 12-05-2024]
భారీ ఈదురు గాలులకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం టెంట్లు కుప్పకూలాయి. -
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో మహా కుంభాభిషేకం
[ 12-05-2024]
జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి మందిరంలో ఆదివారం మహా కుంభాభిషేకం నిర్వహించారు. -
ఎన్నికల పోలింగ్కు పకడ్బందీగా బందోబస్తు
[ 12-05-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేపట్టామని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. -
పిడుగుపాటు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
[ 12-05-2024]
జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు గురైన బాధితులను ఆదిలాబాద్ రిమ్స్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే జోగురామన్న పరామర్శించారు. -
ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం జరగనున్న పోలింగ్కు అర్హులైన ఓటర్లు తరలి రావాలని జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. -
గోపాలకృష్ణ మఠంలో ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలు
[ 12-05-2024]
జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆదివారం ఆది శంకరాచార్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
కీలక ఘట్టం.. ఎవరికో పట్టం..
[ 12-05-2024]
దాదాపుగా రెండు నెలలుగా సాగిన రాజకీయ ప్రచారమంతా ఇప్పుడు ఓటర్ల చుట్టూ కేంద్రీకృతమవుతోంది. కీలక ఘట్టమైన పోలింగ్కు మరో 24 గంటలే మిగిలి ఉంది. -
పోలింగ్కు 1,500 మంది పోలీసులతో బందోబస్తు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. -
పార్టీలు వేరైనా పాతకాపులమేగా
[ 12-05-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ శనివారం మండలంలో సుడిగాలి ప్రచారం చేపట్టారు. ముగింపు కార్యక్రమం సందర్భంగా కరంజి-టిలో భారాస నాయకులు ఎదురుపడ్డారు. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాం
[ 12-05-2024]
అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ముగిసిన ఎన్నికల ప్రచారం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
నిబంధనల ఉల్లంఘన.. యథేచ్ఛగా విక్రయాలు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కు 48 గంటల ముందు మద్యం విక్రయ కేంద్రాలు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
ఆత్రం సుగుణను గెలిపించండి
[ 12-05-2024]
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ 2 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తారని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా: గోడం నగేష్
[ 12-05-2024]
పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇస్తే, అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అన్నారు. శనివారం పొన్నారిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 12-05-2024]
రైతులకు రుణమాఫీ, రైతుబంధు ఇవ్వకుండా దగా చేసిన కాంగ్రెస్కు, మతం పేరిట రాజకీయం చేస్తున్న భాజపాకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే అనిల్జాదవ్ పేర్కొన్నారు. -
కదులుదాం..తరలుదాం
[ 12-05-2024]
ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇప్పటివరకు పార్టీల అభ్యర్థులు, నేతలు ఎంతగా ప్రయాసపడ్డారో.. ఎవరి వ్యూహాలు ఫలించాయో.. ప్రజల నిర్ణయం ఎలా ఉందో నిక్షిప్తం చేసేది రేపు.. -
ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం
[ 12-05-2024]
ప్రేమ వ్యవహారం ఒక యువకుడిని బలిగొనగా, మరొకరు గాయపడేలా చేసింది. ఘటన వివరాలను ఎస్పీ జానకి షర్మిల శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
మోదీ, కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు: వివేక్
[ 12-05-2024]
ప్రధాని మోదీ, భారాస అధినేత కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని, కేంద్రంలో ప్రజాపాలన కొనసాగాలంటే రాహుల్గాంధీ ప్రధాని కావాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. -
గులాబీ శ్రేణుల్లో జోష్..
[ 12-05-2024]
చెన్నూరు పట్టణంలో భారాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా శనివారం నిర్వహించిన బహిరంగ సభ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
రూ. వెయ్యి కోత.. ఎందుకీ తేడా?
[ 12-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ అధికారులకు భోజనం, ఇతర వసతుల కల్పన కోసం ఒక్కో పోలింగ్ కేంద్రానికి రూ.4 వేలు కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. -
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్
[ 12-05-2024]
మంచిర్యాల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మహ్మద్ వాజిద్ అలీ సస్పెండ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు